బిగ్ బాస్ షో డేట్ ఫిక్స్ అయినట్లే..?
ప్రఖ్యాత రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు నాల్గో సీజన్ ఆరంభానికి మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉంది. అనౌన్స్మెంట్ అయిపోయాక ఎటువంటి కన్ఫర్మేషన్ లేదని బిగ్బాస్ ఉండదేమోనని అనుమానపడ్డ వారందరికీ ప్రొమోలు విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది బిగ్బాస్ మేనేజ్మెంట్.
అంతా ఓకే అయినా మరి లేట్ ఎందుకంటే.. ఇందులోకి వెళ్లే క్యాండిట్లనుఎంపిక చేసి కరోనా పరీక్షలు చేసి క్వారంటైన్ లో ఉంచారట. 16మంది వరకూ ఈసారిసీజన్ కు రెడీ అవుతున్నారు. క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత మరోసారి కోవిడ్ పరీక్షలు జరిపి బిగ్బాస్ హౌస్కు పంపించి షో ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి మరోసారి హోస్ట్ గా నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ప్రొమోలో మూడు గెటప్స్లో కనిపించిన నాగ్.. షోలో ఎలా కనిపిస్తారో చూడాలి. ఈ సారి సీజన్లో పార్టిసిపేట్ చేస్తారంటూ కొందరు సెలబ్రిటీలపై వచ్చిన రూమర్లను కొట్టిపారేశారు.
కంటెస్టెంట్ల లిస్టులో జానీ మాస్టర్, ఆది నుంచీ ఎంతోమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. తాము బిగ్బాస్ కు వెళ్లట్లేదంటూ హీరోయిన్లు శ్రద్ధాదాస్, పూనమ్ కౌర్, హీరో తరుణ్, నటి సునయన, జానీ మాస్టర్ తేల్చి చెప్పారు. గాయని మంగ్లీ,, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, సింగర్, నటుడు నోయల్, కరాటే కళ్యాణి, టిక్టాక్ స్టార్లను ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆరియానా, యూట్యూబర్ మెహబూబ్ దిల్సే, జోర్దార్ సుజాత, మై విలేజ్ షో స్టార్ గంగవ్వ పాల్గొననున్నారని సమాచారం.
రెండో సీజన్లో రన్నరప్గా నిలిచిన గీతామాధురి భర్త నందు ఈసారి షోలో ఎంట్రీ అవ్వనున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది. కొరియోగ్రాఫర్ రఘు-ప్రణవి జంటను కూడా తీసుకురానున్నాన్నరనే వార్త వైరల్ అవుతోంది. వీరికి చిన్న పాప ఉండటంతో బహుశా అది కుదరకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 30న ప్రసారమవనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూద్దాం.