Bigg boss 5: క్వారంటైన్‌లో కంటెస్టెంట్స్‌.. ఇద్దరికి కోవిడ్ పాజిటివ్?

బిగ్ బాస్ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చెప్పేయండి బోర్ డమ్ కు గుడ్ బై అంటూ కింగ్ నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా సెప్టెంబర్ 5 నుండి షో మొదలు కానుందని..

Bigg boss 5: క్వారంటైన్‌లో కంటెస్టెంట్స్‌.. ఇద్దరికి కోవిడ్ పాజిటివ్?

Bigg Boss 5

Bigg boss 5: బిగ్ బాస్ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చెప్పేయండి బోర్ డమ్ కు గుడ్ బై అంటూ కింగ్ నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా సెప్టెంబర్ 5 నుండి షో మొదలు కానుందని స్టార్ మా యాజమాన్యం గురువారమే అధికారికంగా ప్రకటించింది. మరోవైపు కంటెస్టెంట్ల ఎంపిక కసరత్తులు పూర్తయి వారిని క్వారంటైన్ కు తరలించినట్టు తెలుస్తుంది. ఈ షో సెప్టెంబర్ 5 నుండి మొదలు కానుందని స్టార్ మా అలా ప్రకటించిందో లేదో సోష‌ల్‌మీడియాలో మాత్రం దీనిపై చాలా వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

సెప్టెంబర్‌ 5న సాయంత్రం 6 గంటలకు ఐదో సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభం కానుండగా ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుంది. స్టార్ మా అలా ఈ ప్రకటన చేసిందో లేదో అంత‌లోనే షాకింగ్ న్యూన్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సీజన్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లను హైదరాబాద్ నగరంలోని ఐటీసీకి చెందిన ఓ ప్రముఖ హోటల్ లో క్వారంటైన్ లో ఉంచారు. అయితే.. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలినట్లుగా ప్రచారం మొదలైంది.

ఇది ఎంతవరకు నిజమన్నది షో నిర్వాహకులు ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయకపోగా ఈ షో అనుకున్న టైంకి మొదలు పెడతారా.. అదే జరిగితే ఆ ఇద్దరి స్థానాన్ని భర్తీ చేసే కంటెస్టెంట్లు ఎవరన్నదానిపై కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈసారి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ ఓ జాబితా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే కాగా దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి స‌మాచారం లేదు. ఇప్పుడు అందులో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ అన్నదానిపై కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షో మొదలయ్యే వరకు ఈ ప్రచారానికి బ్రేకులు పడవేమో బహుశా!