Bollywood Heroins : టాలీవుడ్ కి క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్స్..

ఒకప్పుడు సౌత్ హీరోయిన్ల అల్టిమేట్ టార్గెట్ ఎంత కాదనుకున్నా బాలీవుడ్ సినిమాల్లో చెయ్యడమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్లు వరసపెట్టి టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. స్టార్ హీరోయిన్ల దగ్గరనుంచి అప్ కమింగ్ హీరోయిన్ల వరకూ తెలుగుసినిమాల మీద..................

Bollywood Heroins : టాలీవుడ్ కి క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్స్..

Bollywood Heroins wants to do movies in Tollywood

Bollywood Heroins :  ఒకప్పుడు సౌత్ హీరోయిన్ల అల్టిమేట్ టార్గెట్ ఎంత కాదనుకున్నా బాలీవుడ్ సినిమాల్లో చెయ్యడమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్లు వరసపెట్టి టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. స్టార్ హీరోయిన్ల దగ్గరనుంచి అప్ కమింగ్ హీరోయిన్ల వరకూ తెలుగుసినిమాల మీద, తెలుగు హీరోల స్టార్ డమ్ మీద ఇంట్రస్ట్ చూపిస్తూ టాలీవుడ్ కాలింగ్ అంటూ ఎంట్రీ ఇస్తున్నారు.

తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియా లెవల్ కి మారిపోయింది. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించి తమ క్రేజ్ ని, మార్కెట్ ని పెంచుకోడానికి టాలీవుడ్ వైపు చూస్తున్నారు. మొన్నటి వరకూ తెలుగు సినిమాల ఆఫర్లను ఒప్పుకోవడానికి టైమ్ తీసుకున్న జాన్వికపూర్ మొత్తానికి టాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. అంతకుముందే విజయ్ దేవరకొండ, ప్రభాస్ ,బన్నీ, ఎన్టీఆర్ తో నటించాలనుందని పబ్లిక్ గానే చెప్పిన జాన్వి ఇక ఏమాత్రం లేట్ చెయ్యకుండా ఎన్టీఆర్ కి ఓకే చెప్పేసిందని, ముందునుంచే అనుకుంటున్నట్టే ఎన్టీఆర్-కొరటాల సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వి కపూర్ అని సమాచారం.

బాలీవుడ్ లో సింగిల్ గానే 100కోట్లకు పైగా మార్కెట్ ఉన్న దీపికా పదుకొనే ఇన్నాళ్లకి తెలుగు సినిమా మీద మనసుపారేసుకుంది. దీపికా పదుకొనే బేసిక్ గా సౌత్ అమ్మాయే అయినా బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి టాప్ స్టార్ అయ్యింది. హీరోయిన్ గాఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లయినా ఇంకా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న దీపికా పదుకొనే ఇప్పుడు నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియామూవీ ప్రాజెక్ట్ K సినిమాలో ప్రభాస్ కి జంటగా నటిస్తోంది.

బాలీవుడ్ లో షార్ట్ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మరో భామ ఆలియా భట్ కూడా తెలుగులో ఆఫర్ల కోసం చూస్తోంది. ఇప్పటికే రాజమౌళి ట్రిపుల్ఆర్ సినిమాలో చరణ్ కు హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చింది. రాజమౌళి సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ అయినా చెయ్యడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆలియా భట్ రాజమౌళి, మహేష్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ లేకపోలేదు. అంతేకాదు టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ ఎవరిచ్చినా చెయ్యడానికి రెడీయే అంటోంది ఆలియా భట్.

అప్ కమింగ్ బాలీవుడ్ భామ అనన్య పాండే కూడా తెలుగు సినిమాల మీద ఇంకా ఇంట్రస్ట్ పోలేదంటోంది. విజయ్ తో లైగర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనన్యపాండే ఈ సినిమాతో అంత సక్సెస్ అందుకోలేకపోయింది. అయినా సరే టాలీవుడ్ లో ఎప్పటికైనా సాలిడ్ హిట్ కొట్టడానికి ట్రై చేస్తోంది. తెలుగు నుంచి వస్తున్న ఆఫర్లను వింటూ బెస్ట్ స్క్రిప్ట్ కి ఓకే చెబుతానంటోంది.

సల్మాన్ ఖాన్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన బ్యూటిఫుల్ బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ అయితే ఏకంగా 2 సినిమాలతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని సినిమాతో పాటు ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ అధారంగా తెరకెక్కిన అడవి శేష్ మేజర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి డబుల్ ఫీస్ట్ ఇచ్చింది. అయితే గని డిజాస్టర్ అయినా మేజర్ తో మంచి అప్లాజ్ అందుకుంది సయీ మంజ్రేకర్.

బాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్ మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ దిశాపఠానీ కూడా టాలీవుడ్ వైపు చూస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో గతంలో లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్ గా తెలుగు ఎంట్రీ ఇచ్చిన దిశా పఠానీ ఇప్పుడు ప్రాజెక్ట్ K లో చేస్తుందని సమాచారం. అలాగే మరిన్ని అప్ కమింగ్ తెలుగు ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేస్తోంది.

Krrish 4 : క్రిష్ 4.. డైరెక్టర్ మారనున్నాడా? ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్??

బాలీవుడ్ సూపర్ హాట్ హీరోయిన్లు నోరాఫతేహి, జాక్విలిన్ ఇద్దరూ తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ , క్రిష్ కాంబినేషన్లో వస్తున్న హరిహరవీరమల్లు మూవీలో నోరా, జాక్విలిన్ ఇద్దరూ తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యబోతున్నారు. ఇప్పటికే మరో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా కాకపోయినా స్పెషల్ సాంగ్ అయినా పర్లేదంటూ టాలీవుడ్ లో ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటూ హడావిడి చేస్తోంది. ఇలా బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లందరూ టాలీవుడ్ కాలింగ్ అంటూ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇంకెంతమంది బాలీవుడ్ భామలు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి.