Bollywood : బాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్.. యూపీ సీఎంని కలిసిన బాలీవుడ్ ప్రముఖులు..

తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కలిశారు. యోగి ఆదిత్యనాథ్ ముంబై పర్యటనలో భాగంగా ఈ మీటింగ్ జరిగింది. సునీల్‌ శెట్టి, రవికిషన్‌, జాకీ భగ్నాని, జాకీ ష్రాఫ్, సోనూ నిగమ్, బోనీ కపూర్‌ తో పాటు మరింతమంది ప్రముఖులు..........

Bollywood : బాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్.. యూపీ సీఎంని కలిసిన బాలీవుడ్ ప్రముఖులు..

Bollywood Stars meet UP CM Yogi Adityanath

Bollywood :  గత కొన్ని నెలలుగా బాలీవుడ్ లో వరుస పరాజయాలు, బ్యాన్ బాలీవుడ్ అనే ట్రెండింగ్, బాలీవుడ్ పై, బాలీవుడ్ స్టార్స్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ మాఫియా, నెపోటిజం అంటూ కూడా వ్యతిరేక విమర్శలు వస్తున్నాయి. ప్రేక్షకులు, ప్రజల్లోంచే కాదు బాలీవుడ్ లో ఉన్న కొంతమంది ప్రముఖులు కూడా బాలీవుడ్ లోని కొన్ని అంశాలని వ్యతిరేకిస్తున్నారు.

బాలీవుడ్ లో సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు బాలీవుడ్ మాఫియా, నెపోటిజంని వ్యతిరేకిస్తూ, వాళ్ళ రొటీన్ సినిమాలని, వాళ్ళ పార్టీలని వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పరిశ్రమలో బాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అని ఏర్పడింది. ఓ వైపు బాగా ఎంజాయ్ చేస్తూ, పార్టీలు, రొటీన్ సినిమాలు, విమర్శలతో, నెపోటిజంతో ఉంటే మరో వైపు కంటెంట్ సినిమాలు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, జనాలతో కలిసిపోయే వాళ్ళు ఉన్నారు.

Samantha : చాలా రోజుల తర్వాత జనాల్లోకి వచ్చిన సమంత.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సందడి.. ఇలా అయిపోయిందేంటి..

తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కలిశారు. యోగి ఆదిత్యనాథ్ ముంబై పర్యటనలో భాగంగా ఈ మీటింగ్ జరిగింది. సునీల్‌ శెట్టి, రవికిషన్‌, జాకీ భగ్నాని, జాకీ ష్రాఫ్, సోనూ నిగమ్, బోనీ కపూర్‌ తో పాటు మరింతమంది ప్రముఖులు ఆయన్ని కలిశారు. ఈ మీటింగ్ లో ఈ బాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అంశం కూడా చర్చకి వచ్చినట్టు సమాచారం. అలాగే బాలీవుడ్ సినిమాలు, సమస్యల గురించి, ఇటీవల వస్తున్న విమర్శల గురించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దేశ సంసృతి, సమగ్రత, అభివృద్ధి రూపంలో కూడా బాలీవుడ్ సినిమాల గురించి చర్చించారట. దీంతో ఈ మీటింగ్ బాలీవుడ్ లో చర్చగా మారింది. బీజేపీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో బాలీవుడ్ లోని రెండు వర్గాల ప్రముఖులు మాట్లాడటంతో ఈ మీటింగ్ సంచలనంగా మారింది.