Karan Johar : బాలీవుడ్లో మరోసారి కరోనా కలకలం.. కరణ్ జోహార్ పార్టీ వల్లే.. 50 మందికి పైగా??
ఇటీవల కరణ్ జోహార్ 50వ పుట్టిన రోజు వేడుకలు వెస్ట్ ముంబై అంధేరీలోని యష్ రాజ్ స్టూడియోలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అంతా పాల్గొన్నారు. ఈ పార్టీలోనే కరోనా...............
Bollywood : గత కొన్ని రోజులుగా కరోనా తగ్గుముఖం పడుతుందని అంతా భావిస్తున్నారు. గతంలో చాలా మంది సెలబ్రిటీలకు కూడా కరోనా సోకింది. కొంతమంది మరణించారు కూడా. బాలీవుడ్ లో అయితే చాలా మంది స్టార్స్ కి కరోనా రెండు సార్లు కూడా సోకింది. తాజాగా ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో కరోనా కలకలం మొదలైంది. ఇప్పటికే అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్, షారుఖ్ ఖాన్.. మరి కొంతమంది స్టార్లు తమకి కరోనా వచ్చిందని ప్రకటించారు.
మరికొంతమంది సెలబ్రిటీలు కరోనా వచ్చినా బయటకి చెప్పకుండా సైలెంట్ గా ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. కొన్ని షూటింగ్స్, ఈవెంట్స్ కూడా ఇప్పటికే ఆగిపోయినట్టు తెలుస్తుంది. చాలా మంది బాలీవుడ్ తారలు కరోనా బారిన పడి హోమ్ క్వారెంటైన్లో ఉంటున్నారు. అయితే ఇదంతా కరణ్ జోహార్ పార్టీ వల్లే వచ్చిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Lokesh Kanagaraj : ఖైదీ 2.. సూర్య వర్సెస్ కార్తీ.. విక్రమ్ తో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు లోకేష్..
ఇటీవల కరణ్ జోహార్ 50వ పుట్టిన రోజు వేడుకలు వెస్ట్ ముంబై అంధేరీలోని యష్ రాజ్ స్టూడియోలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అంతా పాల్గొన్నారు. ఈ పార్టీలోనే కరోనా స్ప్రెడ్ అయిందని టాక్ వినిపిస్తుంది. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో దాదాపు 50 మందికి పైగానే కరోనా సోకి ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.