ఆర్ఆర్ఆర్ షూటింగ్కు బ్రేక్: రాజమౌళి చెప్పిన కారణం ఇదే!
భారీ అంచనాలతో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తయ్యింది. ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే ఈ సినిమాకు లేటెస్ట్గా ఒక్క రోజు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు దర్శకుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాకు డిసెంబర్ 25న బ్రేక్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు రాజమౌళి. ఎందుకంటే డిసెంబర్ 25న రాజమౌళి అన్న కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా నటించిన ‘మత్తు వదలరా’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు కీరవాణి మరో కొడుకు కాల బైరవ స్వరాలు సమకూర్చాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. రితేష్ రానా సినిమాకి దర్శకుడు.
‘మత్తు వదలరా’ సినిమా పూర్తి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కింది. రానా చేతులు మీదుగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే ట్రైలర్కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుండగా రాజమౌళి ఆ సినిమాను ఉద్దేశిస్తూ మా ఇద్దరు కుర్రాళ్లు శ్రీ సింహ, కాలభైరవ ఈ మూవీతో వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. నాకెంతో ఎగ్జైంట్మెంట్గా ఉంది.
మూవీ విడుదల రోజున ఆర్ఆర్ఆర్ షూటింగ్ మానేస్తా.. మానేస్తా.. అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ వైజాగ్లోని ఏజెన్సీ ఏరియాలో జరుగుతోంది. ఎన్టీఆర్పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు.
— rajamouli ss (@ssrajamouli) December 18, 2019