వర్మపై కేసు నమోదు చేయండి.. కోర్టు ఆదేశం..

  • Published By: sekhar ,Published On : July 4, 2020 / 02:54 PM IST
వర్మపై కేసు నమోదు చేయండి.. కోర్టు ఆదేశం..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తన కొడుకు హత్యకేసును సినిమాగా తీస్తే ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఫిర్యాదు చేశాడు.

దీంతో వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘మర్డర్’ అనే సినిమా చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ఆర్జీవీ ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల చేశాడు. తాజాగా నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పుపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలిమరి..

Read:తొమ్మిదోసారి.. అయినా సూపర్ హిట్..