Bollywood : బాలీవుడ్ స్టార్ హీరోలపై కేసు నమోదు

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ సామాజికవేత్త తమన్నా హష్మీ.. అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్ కుమార్ లాంటి స్టార్‌ హీరోలు డబ్బు కోసం...................

Bollywood : బాలీవుడ్ స్టార్ హీరోలపై కేసు నమోదు

Amithab

Bollywood :  ఇటీవల చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు డబ్బుల కోసం యాడ్స్ చేస్తున్నారు. కొంతమంది డబ్బుల కోసం ఎలాంటి యాడ్స్ అయినా చేసేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు. ఇటీవల చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ మసాలా యాడ్స్ లో నటించారు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ పాన్ మసాలా యాడ్స్ చేశారు.

దీంతో ఈ స్టార్ హీరోలని జనాలు, నెటిజన్లు ట్రోల్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాలని డబ్బులు తీసుకొని మరీ ఎలా ప్రమోట్ చేస్తారు అంటూ ఫాన్స్ కూడా విమర్శించారు. దీంతో ఈ ట్రోల్స్ కి తట్టుకోలేక అక్షయ్ కుమార్, అమితాబ్ లు ఈ యాడ్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు కూడా. అయినా ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ నలుగురు స్టార్ హీరోలపై ఓ వ్యక్తి కేసు నమోదు చేశాడు.

VishwakSen : హిట్ పడగానే రేటు పెంచేసిన హీరో..

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ సామాజికవేత్త తమన్నా హష్మీ ఈ హీరోలపై కోర్టులో కేసు వేసాడు. అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్ కుమార్ లాంటి స్టార్‌ హీరోలు డబ్బు కోసం గుట్కా ప్రకటనల్లో కనిపించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తన ఫిర్యాదులో తెలిపాడు. ఈ నలుగురు హీరోలపై సెక్షన్‌ 467, 468, 439, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదైంది. మే 27న ఈ కేసును న్యాయస్థానం విచారించనుంది. మరి ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.