Anantha Sriram: రచయిత అనంత శ్రీరామ్పై కేసు నమోదు
తన పాటలతో తెలుగువారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ పాటల రచయితపై కేసులు నమోదయ్యాయి. "దిగుదిగు దిగు నాగ" అంటూ వరుడు కావలెను సినిమాకు రాసిన పాట వివాదానికి కారణం అయ్యింది.
Anantha Sriram: తన పాటలతో తెలుగువారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ పాటల రచయితపై కేసులు నమోదయ్యాయి. “దిగుదిగు దిగు నాగ” అంటూ వరుడు కావలెను సినిమాకు రాసిన పాట వివాదానికి కారణం అయ్యింది. యువ హీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన వరుడు కావలెను సినిమా కోసం ఈ పాటను రాశారు. ఈ పాట ఇటీవల యూట్యూబ్లో విడుదలై మంచి వ్యూస్ దక్కించుకుంది. అయితే, ఈ పాట దేవుడిని కించపరిచేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కేసు పెట్టారు.
నాగశౌర్య హీరోగా నటిస్తోన్న వరుడు కావలెను సినిమాలోని ఒక పాటలో నాగదేవతను కించపరిచేలా ఉన్న పాటలోని పల్లవిని తీసుకుని అనంత శ్రీరామ్ రచన చేయగా.. బీజేపీ మోర్చా నాయకులు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంత శ్రీరామ్ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. అనంత శ్రీరామ్తో పాటు ఆ సినిమా యూనిట్పై చర్యలు తీసుకోవాలని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నాయకులు.
ఈ మధ్య టాలీవుడ్ పరిశ్రమలోని సినిమాలు, పాటలపై వివాదాలు తలెత్తుతుండగా.. ఈ పాటపై సోషల్ మీడియా ఇప్పటికే నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో రీతువర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈసినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఈ విషయంపై చిత్ర యూనిట్, శ్రీరామ్ ఎలా స్పందిస్తారో చూడాలి.