తొలిసారి పౌరాణిక పాత్రలో.. వీడియో షేర్ చేసిన ప్రభాస్..
టాలీవుడ్ రెబల్ స్టార్, బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. డార్లింగ్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీగా ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు.ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొదించనుండటం విశేషం. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నపౌరాణిక చిత్రమిది. ‘‘చెడుపై మంచి సాధించే విజయాన్ని పండగ చేసుకుందాం’’ అనే క్యాప్షన్ ఇవ్వడంతో రామాయణాన్నే ‘ఆదిపురుష్’ అని తెరకెక్కిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రకటనకు సంబంధించిన వీడియోను ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
ఈ సందర్భంగా సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘ఆది పురుష్’ లో ప్రతి పాత్రా గొప్పదే..ప్రతి పాత్రా ఛాలెంజింగ్గా ఉంటుంది. ‘ఆదిపురుష్’ తరహా పాత్ర మరింత బాధ్యతను పెంచుతుంది. పౌరాణిక పాత్రలో నటించడం ఆనందంగా, మరింత ఉత్సాహంగా ఉంది. మన దేశ యువతకు నచ్చే సినిమా అవుతుంది’’ అని తెలిపారు.
https://www.instagram.com/p/CEBp2d_JUxC/?utm_source=ig_web_copy_link