వెన్నులో వణుకు పుట్టాలి.. ‘ఇన్‌సాఫ్‌కి సుభాహ్.. దేర్ సే హి సహీ’ – నిర్భయ ఉరిపై స్పందన..

నిర్భయ నిందితుల ఉరి.. సెలబ్రిటీల స్పందన..

  • Published By: sekhar ,Published On : March 20, 2020 / 07:16 AM IST
వెన్నులో వణుకు పుట్టాలి.. ‘ఇన్‌సాఫ్‌కి సుభాహ్.. దేర్ సే హి సహీ’ – నిర్భయ ఉరిపై స్పందన..

నిర్భయ నిందితుల ఉరి.. సెలబ్రిటీల స్పందన..

2012 డిసెంబర్ 16.. భారతదేశంలో మహిళలకు రక్షణ లేదని, మగాళ్ల రూపంలో మృగాళ్లు సమాజంలో తిరుగుతున్నారంటూ నిరూపితమైన రోజు.. యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులు ( ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌) తీహార్ జైలులో ఉరి వేశారు.

ఈ సందర్భంగా భారతదేశ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ స్పందన తెలిచేస్తున్నారు. కార్తి, మంచు లక్ష్మీ ప్రసన్న, కేథరిన్, అనసూయ భరద్వాజ్, నాగశౌర్య వంటి  సినీ పరిశ్రకు చెందిన పలువురు ట్విట్టర్ ద్వారా తమ స్పందన తెలియచేశారు. లేటు అయినా న్యాయమే గెలిచిందని వారంతా అభిప్రాయ పడ్డారు.

కార్తి : 8 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది. గతేడాది పొలాచ్చిలో 16 సంవత్సరాల బాలికపై 10 మంది అత్యాచారం చేసిన కేసులో దోషులకు శిక్ష పడడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అనసూయ – ‘ఇన్‌సాఫ్‌కి సుభాహ్.. దేర్ సే హి సహీ’ అంటూ హిందీలో పోస్టు పెట్టింది. న్యాయోదయం… తీర్పు లేట్ అయిన‌, స‌రైన‌దే జ‌రిగింది  అనే అర్థం వచ్చేలా చాలా రోజుల తర్వాత హిందీలో ట్వీట్ చేసిందామె. 

నిర్భయ నిందుతులకు ఉరి శిక్ష పడడం సరైన నిర్ణయం.. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకూడదు. అలా ఆలోచించే వాళ్లకి నిర్భయ ఉదంతం వెన్నులో వణుకు పుట్టించాలి అంటూ పలువురు సెలబ్రిటీలు స్పందించారు.