Celebrities Pets : పెంపుడు కుక్కలతో హీరోయిన్స్ బిజీ..!

సమంత తన పెట్ డాగ్ హ్యాష్‌తో కలిసి బెలూన్ గేమ్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసింది..

Celebrities Pets : పెంపుడు కుక్కలతో హీరోయిన్స్ బిజీ..!

Celebrities With Pets

Celebrities Pets: సమంత, నభా, రష్మి, పూజా.. ఈ హీరోయిన్లు ఈ మధ్య ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఏదో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో టైమ్ లేకుండా కష్టపడుతున్నారేమో అనుకుంటున్నారా..? కాదు.. ఉంటే షూటింగ్.. లేకపోతే ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలతో టైమ్ లేకుండా తెగ ఎంగేజ్ అయిపోతున్నారు. అసలు వీళ్లల్లో కొంతమందికి పెళ్లేకాలేదు.. పిల్లలేంటి అనుకుంటున్నారా..? అదేంటో మీరూ చూడండి.

లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లోనే ఉన్న స్టార్స్‌కి, స్పెషల్లీ హీరోయిన్స్ పిల్లలతో ఫుల్ టైమ్‌పాస్ అయిపోయింది. పిల్లలంటే.. వాళ్లు ముద్దుగా పెంచుకునే పెట్స్.. ఈ పెట్స్‌లో మ్యాగ్జిమమ్ అన్నీ కుక్కలే. షూట్ లేనప్పుడు ఈ కుక్కలతో ఫుల్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా సమంత తన పెట్ డాగ్ హ్యాష్‌తో కలిసి బెలూన్ గేమ్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసింది. సమంత, నాగ చైతన్య తమ సొంత బిడ్డలానే పెంచుకున్న హ్యాష్‌కి బర్త్‌డే కూడా గ్రాండ్‌గా చేశారు. అంతేకాదు ఈ హ్యాష్‌కి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

సమంత అనే కాదు.. లేటెస్ట్‌గా రష్మిక మందన్న కూడా ఓ క్యూట్ కుక్కపిల్లని కొనేసింది. ఆరా ఆరా అంటూ క్యూట్‌గా పిలుచుకునే ఈ పెట్‌తోనే తెగ కాలక్షేపం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య బాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్లినప్పుడు తనతో పాటే తీసుకువెళ్లింది. అంతేకాదు అక్కడ ఆరాకి హెల్త్ బాలేకపోతే తెగ బాధపడిపోయి హాస్పిటల్ చుట్టూ తిరిగింది రష్మిక.

మిల్కీ బ్యూటీ తమన్నా అయితే.. షూట్ అయిపోయిన తరవాత ఇంటికెళ్లగానే తన పప్పీ పలకరించే ఆ పిలుపు కోసం తపించిపోతు అని చెబుతోంది. యాష్ కలర్‌లో ఉండే క్యూట్ పప్పీతో కలిసి టైమ్ స్పెండ్ చెయ్యడంతో పాటు ఎన్నో మెమరీస్ ఉన్నాయంటోంది తమన్నా.

సౌత్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా తన పెట్స్‌తో ఫుల్ టైమ్ పాస్ చేస్తుంది. కుక్కలకి సంబంధించి ఫుడ్ విషయంలో ఎండార్స్‌మెంట్స్ కూడా చేస్తూ చాలా కేరింగ్‌గా ఉంటుంది ఈ బుట్ట బొమ్మ. రకుల్ ప్రీత్ కూడా తన పెట్ డాగ్.. క్యాండీతో టైమ్ స్పెండ్ చెయ్యడం.. చాలా ఇష్ట మంటూ క్యాండీతో తను చేసిన అల్లరిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇక ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ అయితే.. ఇంకో అడుగు ముందుకేసి మిస్సైన నా కుక్కని తీసుకొస్తే.. లక్ష రూపాయల రివార్డ్ ఇస్తానని అనౌన్స్ చేసింది. ఎంతో ప్రేమగా చాలా కాలం నుంచి చూసుకుంటున్న నా డాగీ మిస్ అయిపోయింది, వెతికి పెట్టండని పోస్టర్లు వేసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.