‘ఇద్దరిలోకం ఒకటే’ సెన్సార్ పూర్తి : డిసెంబర్ విడుదల

రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటిస్తున్న‘ఇద్దరిలోకం ఒకటే’.. (యూ ఆర్ మై హార్ట్ బీట్) సెన్సార్ పూర్తి.. డిసెంబర్‌లో విడుదల..

  • Published By: sekhar ,Published On : November 29, 2019 / 11:03 AM IST
‘ఇద్దరిలోకం ఒకటే’ సెన్సార్ పూర్తి : డిసెంబర్ విడుదల

రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటిస్తున్న‘ఇద్దరిలోకం ఒకటే’.. (యూ ఆర్ మై హార్ట్ బీట్) సెన్సార్ పూర్తి.. డిసెంబర్‌లో విడుదల..

రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా.. దిల్ రాజు సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం: 35గా శిరీష్ నిర్మిస్తున ప్రేమకథా చిత్రం.. ‘ఇద్దరిలోకం ఒకటే’.. (యూ ఆర్ మై హార్ట్ బీట్) జీఆర్ కృష్ణ దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ అండ్ లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

క్యూట్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ ఎటువంటి కట్స్ చెప్పకుండా U/A సర్టిఫికెట్ జారీ చేశారు. యూత్‌ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారని సెన్సార్ బృందం చెప్పారని తెలుస్తోంది.

Image

ఇంతకుముందు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని చెప్పారు మేకర్స్. న్యూ పోస్టర్ మీద రిలీజ్ డేట్ కన్ఫమ్ చేయలేదు కానీ డిసెంబర్‌లో విడుదల అని ప్రకటించారు. కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : తమ్మిరాజు, మ్యూజిక్ : మిక్కీ జె.మేయర్, మాటలు : అబ్బూరి రవి, సహ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి – బెక్కెం వేణుగోపాల్.