Chiranjeevi : డైరెక్టర్స్ ఇగోలకి పోవద్దు.. మరోసారి సినిమా దర్శకులపై మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్..

చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమా కథ అందరూ బాగుంది అని చెప్పినా బాబీని నేను పిలిచి పర్సనల్ గా ఇది బిలో యావరేజ్ సినిమా అని చెప్పి దీని మీద మరింత వర్క్ చేయమని చెప్పాను. అందరూ బాగుంది అన్నారు కదా అని చెప్పకుండా దాని మీద వర్క్ చేశాడు. సినిమా షూట్ టైములో.................

Chiranjeevi : డైరెక్టర్స్ ఇగోలకి పోవద్దు.. మరోసారి సినిమా దర్శకులపై మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్..

Chiranjeevi sensational comments on Directors

Chiranjeevi :  చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా రవితేజ, క్యాథరిన్ ముఖ్యపాత్రల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి మంచి విజయం సాధించింది. పండగకి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సక్సెస్ మీట్ లో చిరంజీవి చాలా సేపు మాట్లాడారు. సినిమా గురించి, పరిశ్రమ గురించి, సినిమాకి పని చేసిన వాళ్ళ గురించి మాట్లాడారు. అలాగే డైరెక్టర్ బాబీ గురించి మాట్లాడుతూ మరోసారి సినీ దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sankranthi Movies : సినిమాల పండుగ.. సంక్రాంతి సినిమాలు..

చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమా కథ అందరూ బాగుంది అని చెప్పినా బాబీని నేను పిలిచి పర్సనల్ గా ఇది బిలో యావరేజ్ సినిమా అని చెప్పి దీని మీద మరింత వర్క్ చేయమని చెప్పాను. అందరూ బాగుంది అన్నారు కదా అని చెప్పకుండా దాని మీద వర్క్ చేశాడు. సినిమా షూట్ టైములో కూడా ఎన్నో చేంజెస్ అప్పటికప్పుడు చేశారు. సినిమా రిలీజ్ అయ్యేదాకా అందరూ చెప్పే డౌట్స్ ని బాబీ తన టీంతో కూర్చొని డిస్కస్ చేస్తూ సాల్వ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టే ఇంత మంచి సినిమా వచ్చింది. ఎక్కడా ఇగోకి వెళ్లకుండా ఎవరు చెప్పినా వింటూ, దాని మీద మరింత కష్టపడి మంచి సినిమాని తీశాడు. డైరెక్టర్స్ ఈగోలకి వెళ్ళకూడదు. డైరెక్టర్ సినిమా హిట్ ఇవ్వడం కాదు. ఇచ్చిన టైములో, ఇచ్చిన బడ్జెట్ లో సినిమాని తీయగలగాలి. ఎవరో డైరెక్టర్ భారీగా తీశారు కదా అని మనం అక్కర్లేకపోయినా భారీగా వెళ్ళకూడదు. సినిమాని షూట్ చేసి ఇది అక్కర్లేదు అని ఎడిటింగ్ లో కట్ చేయకూడదు. అలా చేయడం వాళ్ళ డబ్బు, టైం, కష్టం అంతా వేస్ట్ అవుతుంది. అదంతా నిర్మాతలకి నష్టమే. ఏ మార్పులు, చూపులు ఉన్నా పేపర్ వర్క్ మీదే చేసుకోవాలి. అంతా ఓకే అనుకున్నాకే షూట్ కి వెళ్ళండి. ఇప్పటి డైరెక్టర్స్ చాలా నేర్చుకోవాలి. నిర్మాతలు ఉన్నారు కదా అని డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టొద్దు. నిర్మాతలు బాగుంటేనే మనం బాగుంటం, సినీ పరిశ్రమ బాగుంటుంది. ఇది దర్శకులు గుర్తించాలి అని అన్నారు. అలాగే ఈ వ్యాఖ్యలని ఏ డైరెక్టర్ ని ఉద్దేశించి చేయలేదు, దయచేసి మీడియా వాళ్ళు తప్పుగా రాయకండి అని వ్యాఖ్యలు కూడా చేయడంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.