Chiranjeevi : కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చిరు, నాగ్ భేటీ.. సినీ పరిశ్రమలోని సమస్యలు పై చర్చ..

ఇండస్ట్రీలో పెద్ద దిక్కు పదవి నాకు వద్దు, అవసరం ఉన్నప్పుడు ఒక సినీ కార్మికుడిగా నా వంతు సహాయం నేను చేస్తూనే ఉంటా అంటూ చిరంజీవి చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే..

Chiranjeevi : కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చిరు, నాగ్ భేటీ.. సినీ పరిశ్రమలోని సమస్యలు పై చర్చ..

Chiranjeevi and nagarjuna

Chiranjeevi : ఇండస్ట్రీలో పెద్ద దిక్కు పదవి నాకు వద్దు, అవసరం ఉన్నప్పుడు ఒక సినీ కార్మికుడిగా నా వంతు సహాయం నేను చేస్తూనే ఉంటా అంటూ చిరంజీవి చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనకి అవకాశం కలిగిన ప్రతిసారి సినీ పరిశ్రమ సమస్యల పై పోరాడుతూనే ఉంటున్నాడు. తాజాగా ఇదే విషయం పై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌తో భేటీ అయ్యాడు చిరంజీవి. ఈ సమావేశంలో హీరో నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరంజీవి ట్వీట్ చేశాడు.

Chiru – Balayya : చిరు దారిలో బాలయ్య.. నిజమేనా?

నిన్న (ఫిబ్రవరి 26) హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌, చిరు ఇంటికి అథిదిగా వచ్చాడు. అనురాగ్ ఠాకూర్‌ని సన్మానించిన చిరంజీవి, నాగార్జున.. సినీ పరిశ్రమలోని సమస్యలు మరియు దాని పురోగతి గురించి అనురాగ్ ఠాకూర్‌కి వివరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా చిరు షేర్ చేశాడు. కాగా ప్రస్తుతం చిరు భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా వస్తుంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక నాగార్జున సినిమాలు విషయానికి వస్తే.. చివరిగా ‘ది ఘోస్ట్’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి నాలుగు నెలలు గడుస్తున్నా నాగార్జున మాత్రం మరో మూవీ ప్రకటించలేదు. అయితే ఫిలిం వర్గాల్లో నాగార్జున.. తన నెక్ట్స్ మూవీని ‘ధమాకా’ రైటర్ ప్రసన్న కుమార్ డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.