పసుపులేటి రామారావు కుటుంబానికి చిరు పరామర్శ – పవన్ సంతాపం

సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కుటుంబ సభ్యులను చిరంజీవి పరామర్శించారు..

  • Published By: sekhar ,Published On : February 11, 2020 / 11:26 AM IST
పసుపులేటి రామారావు కుటుంబానికి చిరు పరామర్శ – పవన్ సంతాపం

సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కుటుంబ సభ్యులను చిరంజీవి పరామర్శించారు..

సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు(70) అనారోగ్యంతో బుధవారం (ఫిబ్రవరి 11) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సినీ పరిశ్రమకు చెందినవారు, మీడియా మిత్రులు సంతాపం తెలుపుతున్నారు. పసుపులేటి రామారావు గారి భౌతిక కాయం వద్ద మెగాస్టార్ చిరంజీవి పూలమాల ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.

chiru

రామారావు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు కళ్యాణ్ నాగ చిరంజీవిని ఆయన పరామర్శించారు. రామారావు పార్థివ దేహం మధ్యాహ్నం హైదరాబాద్ ఇందిరానగర్‌లోని ఇంటికి చేరగానే చిరంజీవి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

janasena

సినీప్రముఖులు ఎస్.వి. కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి, బీవీఎస్ఎన్ ప్రసాద్, మాదాల రవి, సి.వి. రెడ్డి తదితరులు కూడా అక్కడికి చేరుకుని రామారావు భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. కాగా పవన్ కళ్యాణ్ రామారావు మృతికి సంతాపం తెలుపుతూ జనసేన పార్టీ తరపున ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.