చిరు ఆశీస్సులందుకున్న శౌర్య
‘అశ్వథ్థామ’ చిత్రం విడుదల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులందుకున్న యంగ్ హీరో నాగ శౌర్య..
‘అశ్వథ్థామ’ చిత్రం విడుదల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులందుకున్న యంగ్ హీరో నాగ శౌర్య..
యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో.. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్.. ‘అశ్వథ్థామ’.. ఈ సినిమాకు నాగశౌర్య కథనందించడం విశేషం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 31న బాక్సాఫీస్ బరిలో దిగనుంది ‘అశ్వథ్థామ’.. గతకొద్ది రోజులుగా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న హీరో నాగశౌర్య తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తల్లి ఉషాతో కలిసి శౌర్య చిరు నివాసానికి వెళ్లి, తమ సినిమాకు ఆశీస్సులు అందచేయాలని కోరగా.. చిరు ‘అశ్వథ్థామ’ మంచి విజయం సాధించాలని ఆశీర్వదించారు. ఆయన వెంట తల్లి ఉషా కూడా ఉన్నారు.
Read Also : RRR – తారక్ ట్వీట్ : వైరల్ అవుతోన్న ఫోటో
మెగా డాటర్ నిహారిక, శౌర్య హీరోగా నటించిన ‘ఒక్క మనసు’ సినిమాతో కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే. కాగా ‘గోపాల గోపాల’ సినిమాలో ‘అశ్వథ్థామ’ గురించి చెప్పే డైలాగ్, ఈ ‘అశ్వథ్థామ’ కి ఇన్స్పిరేషన్. అందుకే శరత్ మరార్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ డైలాగ్ వాయిస్ ఓవర్ సినిమా స్టార్టింగ్లో పెట్టడం జరిగింది.. అని తాజాగా ఓ ఇంటర్వూలో నాగ శౌర్య చెప్పాడు. ప్రస్తుతం శౌర్య ‘అశ్వథ్థామ’ చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నాడు.