హ్యాట్సాప్ ఫైర్ మెన్ : రూ.లక్ష బహుమతి ఇచ్చిన చిరంజీవి
నాలాలో పడిన పాపను రక్షించిన ఫైర్మెన్కు లక్ష రూపాయల ప్రోత్సాహక బహుమతి అందచేసిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్..
నాలాలో పడిన పాపను రక్షించిన ఫైర్మెన్కు లక్ష రూపాయల ప్రోత్సాహక బహుమతి అందచేసిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్..
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రీసెంట్గా తన అభిమాని కోరిక మేరకు, అతని కొడుక్కి పవన్ శంకర్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఒక ఫైర్మెన్ని అభినందిస్తూ.. రూ.లక్ష బహుమతి అందచేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కాలంలో హైదరాబాద్ గౌలిగూడలోని దివ్య అనే 4 సంవత్సరాల పాప ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయింది. ఇది గమనించిన ఫైర్ మెన్ క్రాంతి కుమార్ కష్టపడి పాపను కాపాడాడు.
ఈ విషయాన్ని న్యూస్ పేపర్లో చూసి తెలుసుకున్న చిరంజీవి.. ఫైర్ మెన్ క్రాంతి కుమార్ను అభినందిస్తూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున లక్ష రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందించారు. ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ అల్లు అరవింద్ స్వయంగా క్రాంతి కుమార్కు చెక్ అందించారు. అతనికి సహకరించిన సిబ్బందిని, గౌలిగూడ స్టేషన్ ఎఫ్ఎస్ఓ జయరాజ్ కుమార్ను అరవింద్ అభినందించారు.