Chiranjeevi : శృతిహాసన్‌ని ‘వీరసింహారెడ్డి’ ఫంక్షన్‌లో ఎవరో బెదిరించారు.. చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ.. శృతిహాసన్‌ని 'వీరసింహారెడ్డి' ఫంక్షన్‌లో ఎవరో బెదిరించారు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

Chiranjeevi : శృతిహాసన్‌ని ‘వీరసింహారెడ్డి’ ఫంక్షన్‌లో ఎవరో బెదిరించారు.. చిరంజీవి!

Chiranjeevi comments on Shruti Haasan

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు అండ్ రవితేజ ఇద్దరు హాజరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇక ఈ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ.. శృతిహాసన్‌ని ‘వీరసింహారెడ్డి’ ఫంక్షన్‌లో ఎవరో బెదిరించారు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

Chiranjeevi : రవితేజ ముంబై హీరో.. తెలుగు వాడిని అనిపించుకోడానికి లోకల్ అంటాడు.. చిరంజీవి!

‘ఈ సినిమాలో నటించిన హీరోయిన్ శృతిహాసన్ ఇవాళ ఇక్కడికి రాలేకపోయింది. వీరసింహారెడ్డి ఫంక్షన్ కోసం ఒంగోలు వెళ్లిన ఆ అమ్మాయి అక్కడ ఏమి తిన్నదో జ్వరం వచ్చింది అంటా. తినడం వల్లే వచ్చిందా లేదా ఎవరన్నా బెదిరిస్తే వచ్చిందో అర్ధంకావడం లేదు’ అంటూ సరదాగా మాట్లాడాడు. ఇక శృతిహాసన్ తనకి ఫోన్ చేసి అనారోగ్యంగా ఉన్నట్లు, కరోనా టెస్ట్ కూడా చేయించుకున్నట్లు తెలియజేశాడు. అలాగే మూవీ టీంకి, ఆడియన్స్ కి రాలేకపోయినందుకు శృతిహాసన్ క్షమాపణ చెప్పినట్లు వెల్లడించాడు.

“ఆమె త్వరగా కోలుకోవాలని మనందరి తరుపున నేను కోరుకుంటున్నాను. ఇక సినిమాలో తాను కేవలం గ్లామర్ టచ్ కోసమే పెట్టలేదు. కథతో పాటు ఒక యాక్షన్ సీన్ లో కూడా ఆమెకు ఇంపార్టెన్స్ ఉంది. అలాగే ఫ్రాన్స్ లో సాంగ్స్ చిత్రీకరణ సమయంలో శృతి చాలా కష్టపడింది. మైనస్ 8 డిగ్రీలలో చీరలో ఒణికి పోయేది, నాకు చాలా బాధ అనిపించేది. అయినా సరే డాన్స్ చేస్తున్నప్పుడు ఆ బాధ ఫేస్ లో ఎక్కడ కనబడకుండా చేసింది. శృతి పని మీద నీకు ఉన్న నిబద్ధతకు హ్యాట్సాఫ్” అంటూ ప్రశంసించాడు. కాగా ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా ఒక ముఖ్యపాత్ర పోషిస్తుండగా, ఊర్వశి రౌటెలా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రాబోతుంది.