Chiranjeevi-Nagarjuna: అభిమానులకు పూనకాలే.. చిరు-నాగ్ మల్టీస్టారర్!
టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే.. కాస్త అటూ ఇటుగా సీనియర్ హీరోలతో యంగ్ హీరోలు జతకట్టి ఈ మల్టీస్టారర్ సినిమాలు చేసున్నారు.
Chiranjeevi-Nagarjuna: టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే.. కాస్త అటూ ఇటుగా సీనియర్ హీరోలతో యంగ్ హీరోలు జతకట్టి ఈ మల్టీస్టారర్ సినిమాలు చేసున్నారు. అయితే.. సీనియర్ హీరోలలో ఇద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి వరకు ఏ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ మూవీలు చేయలేదు. ఒకటే రెండు చోట్ల గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినా ఎక్కడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు.
Big Boss 5: కాస్త ఎమోషన్..ఇంకాస్త రొమాంటిక్.. ప్రేమ పక్షుల గోరుముద్దలు!
మెగాస్టార్ చిరంజీవి.. మన్మధుడు నాగార్జున కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ కల నెరవేరే సమయం ఆసన్నమైనట్లుగా కనిపిస్తుంది. ఈ ఇద్దరూ కలిసి కోలీవుడ్ సూపర్ మూవీ ‘విక్రమ్ వేద’ సినిమాని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. నిజానికి ఈ సినిమాపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే, ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు అలా అలా వెనక్కు వెళ్తుంది. కాగా, ఇప్పుడు మొత్తానికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది.
Sankranti 2022: సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర!
నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టు టేకప్ చేసినట్లు తెలుస్తుండగా ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని చెప్తున్నారు. విక్రమ్ వేద సినిమా పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో కూడా పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించే అవకాశం ఉండగా విజయ్ సేతుపతి క్యారెక్టర్లో చిరంజీవి, మాధవన్ పాత్రలో నాగార్జున నటించబోతున్నట్లు టాక్ నడుస్తుంది.
Naga Chaitanya-Samantha: ఫస్ట్ టైమ్ చైతూ డిస్టర్బ్.. మాటల్లో చూపించేశాడు!
విక్రమార్కుడు, బేతాళుడు కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలీవుడ్లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్లతో రీమేక్ చేయనుండగా తెలుగులో చాలాకాలంగా ఈ రీమేక్ పై ఊహాగానాలు వస్తుండగా ఇప్పటికే బాలయ్య-రాజశేఖర్, నాగార్జున-వెంకటేష్, పవన్ కళ్యాణ్- రవితేజ ఇలా చాలామంది హీరోల కాంబినేషన్ తెరపైకి రాగా.. ఇప్పుడు మొత్తానికి ఫైనల్ గా చిరు-నాగ్ పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తుంది.