Chiranjeevi : ప్రధాని మోదీతో వేదికని పంచుకోబోతున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీతో వేదికని పంచుకోబోతున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఘనంగా........
Modi : మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీతో వేదికని పంచుకోబోతున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జులై 4న ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వం నటుడు చిరంజీవిని ఆహ్వానించింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి ఈ మేరకు చిరంజీవికి లేఖ రాశారు. ఈ లేఖలో.. ”ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నాము. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఏడాదిపాటు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించబోతోంది. వీటన్నిటికీ కూడా మీ సహకారం కోరుకుంటున్నాము” అని తెలుపుతూ చిరంజీవిని కిషన్రెడ్డి ఆహ్వానించారు.
Dil Raju : 50 ఏళ్ళ వయసులో తండ్రి అయిన దిల్రాజు.. పండంటి బాబుకి జన్మనిచ్చిన దిల్రాజు వైఫ్..
దీంతో చిరంజీవి జులై 4న భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీతో వేదికని పంచుకోబోతున్నారు.