Chiranjeevi: సంక్రాంతికి మెగాస్టార్ డబుల్ ట్రీట్.. ఎక్కడ చూసినా చిరంజీవే!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Chiranjeevi: సంక్రాంతికి మెగాస్టార్ డబుల్ ట్రీట్.. ఎక్కడ చూసినా చిరంజీవే!

Chiranjeevi To Give Double Treat To Fans On Sankranti

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Chiranjeevi : వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ కి స్పెషల్ న్యూ ఇయర్ పార్టీ ఇచ్చిన మెగాస్టార్..

ఇక పండగపూట తమ అభిమాన హీరో సినిమాను చూసేందుకు మెగా ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. అయితే సంక్రాంతి కానుకగా మెగాస్టార్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వెండితెరపై ‘వాల్తేరు వీరయ్య’గా సత్తా చాటనున్న మెగాస్టార్, ఇటు బుల్లితెరపై ‘గాడ్‌ఫాదర్’గా తన ప్రతాపం చూపించబోతున్నాడు. చిరు నటించిన లాస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జనవరి 15న జెమిని టీవీలో టెలికాస్ట్ కానుంది.

Chiranjeevi : చిరంజీవి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాడో తెలుసా?

ఇలా సంక్రాంతి పండగకు వెండితెరపై, బుల్లితెరపై ఎటు చూసినా మెగాస్టార్ హవానే కనిపించనుండటంతో మెగా ఫ్యాన్స్‌కు అసలైన పండగ రానుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక వాల్తేరు వీరయ్యలో మరో స్టార్ హీరో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.