Chiranjeevi : సాయితేజ్ కోలుకుంటున్నాడు- చిరంజీవి

సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన 'రిపబ్లిక్' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు.

Chiranjeevi : సాయితేజ్ కోలుకుంటున్నాడు- చిరంజీవి

Chiranjeevi

Chiranjeevi : సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. సాయితేజ్ ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు. సాయితేజ్ త్వరగా కోలుకుంటున్నాడని తెలిపారు. ‘రిపబ్లిక్’ చిత్రం సక్సెస్ రూపంలో సాయితేజ్ కు అందరి ఆశీస్సులు అందుతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

Read More : Kodali Nani : చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసిరా.. చూసుకుందాం : పవన్ కు కొడాలి నాని సవాల్

అంతేకాకుండా, కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిటర్లు, థియేటర్లు కోలుకోవడానికి ‘రిపబ్లిక్’ చిత్రం విజయం కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆకాంక్షిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా యూనిట్ కు బెస్టాఫ్ లక్ చెబుతూ ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా ఈ నెల 10న సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

Read More : Sri Reddy: సంసారంపై సమంతకు శ్రీరెడ్డి సలహాలు