Corona Positive : షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ కు కరోనా

బాలీవుడ్ లో కరోనా కలకలం రేగింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ కరోనా బారిన పడ్డారు.

Corona Positive : షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ కు కరోనా

Corona

Corona positive : దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బాలీవుడ్ లో కరోనా కలకలం రేగింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ కరోనా బారిన పడ్డారు. వీరిద్దరికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గతంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 4,270 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 15 మంది మరణించారు. 2,619 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,31,76,817కి చేరింది.

Covid in India..Mask must : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్లీ మాస్కు నిబంధన తప్పనిసరి

ఇందులో 4,26,28,073 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,692 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. 24,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో కేరళలోనే 1,465 కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో 1375, ఢిల్లీలో 405, కర్నాటకలో 222, హర్యానాలో 144 చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06 శాతంగా ఉన్నాయి. 98.73 శాతం మంది కోలుకున్నారు. 1.22 మంది కరోనా బారిన పడి మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.