మహేష్ బాబు పాటలో మాటకు.. వార్నర్ మాయమైపోయాడు

  • Published By: vamsi ,Published On : May 25, 2020 / 08:15 AM IST
మహేష్ బాబు పాటలో మాటకు.. వార్నర్ మాయమైపోయాడు

కరోనా ప్రభావంతో ప్రస్తుతం ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉండగా.. సామాన్య ప్రజలు, సెలెబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. సెలెబ్రిటీలు ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులని ఎంటర్టైన్ చేస్తున్నారు. క్రికెటర్లు కూడా ఇప్పట్లో మైదానానికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇళ్లలోనే ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైదానంలో బౌలర్లపై చిచ్చర పిడుగులా రెచ్చిపోయే వార్నర్ ప్రస్తుతం ఇంట్లో తెలుగు పాటలకు, డైలాగులకు టిక్ టాక్‌లో రచ్చ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా వార్నర్ టాలీవుడ్ సినిమా పాటలు, డైలాగులతో టిక్ టాక్ వీడియోలు చేస్తుండగా.. లేటెస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టన రోజు సంధర్భంగా ఎన్టీఆర్ పాటను కూడా తన భార్యతో కలిసి చేశాడు..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ట్విట్టర్‌లో మరో వీడియో పోస్ట్ చేసి అలరించాడు. ‘షాడో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భార్య, పిల్లల మాటలు వినపడగానే’ బై బై అంటూ మాయమైపోతూ ట్వీట్ చేశాడు. మహేశ్ బాబు నటించిన ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలో మైండ్ బ్లాక్ పాటలో ‘వాడిని కొట్ట‌మ‌ను డప్పూ’ అనే మాటకు సంబంధించిన మ్యూజిక్‌కు పెర్ఫామ్ చేశాడు. 

ఇప్పటికే పలువురు తెలుగు హీరోల పాటలకు స్టెప్పులు వేసిన వార్నర్.. మహేష్ బాబు అభిమానుల కోర్కెను కూడా తీర్చేశాడు. మహేష్ బాబు అభిమానులు చాలా రోజుల నుంచి మైండ్ బ్లాక్ పాటకు స్టెప్పులేయమని అడుగుతుండగా.. ఆ పాట అందుబాటులో లేదని సమాధానం చెబుతూ ఉన్నాడు.. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా పాటలో మాటకు క్రికెట్ బ్యాట్‌తో యాక్షన్ చేసి చూపించాడు. 

Read: పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉంటావో చూస్తా..తేజ్ కు నితిన్ ఫన్నీ కామెంట్స్