Aishwaryaa : ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య కరోనాతో హాస్పిటల్లో
ఇటీవలే ఐశ్వర్య ధనుష్ నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఒక షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చింది. తాజాగా కరోనా సోకడంతో హాస్పిటల్ లో జాయిన్ అయింది. మంగళవారం రాత్రి ఈ విషయాన్ని తన.....
Aishwaryaa : ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చాలా మంది కోవిడ్ బారిన పడుతున్నారు. థర్డ్ వేవ్ లో చాలా మంది సెలబ్రిటీలకు కరోనా సోకుతుంది. తాజాగా రజనీకాంత్ కూతురు, స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్యకి కరోనా సోకింది.
Spidar Man : 36 కోట్లతో గర్ల్ఫ్రెండ్ కోసం ఖరీదైన ఇల్లు కొన్న స్పైడర్ మ్యాన్
ఇటీవలే ఐశ్వర్య ధనుష్ నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఒక షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చింది. తాజాగా కరోనా సోకడంతో హాస్పిటల్ లో జాయిన్ అయింది. మంగళవారం రాత్రి ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఐశ్వర్య హాస్పిటల్ లో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ”అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి. 2022 ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను” అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేసింది. దీంతో ఐశ్వర్య త్వరగా కోలుకోవాలంటూ పలువురు ప్రముఖులు, అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఐశ్వర్య ఆరోగ్యంపై ధనుష్ ఏమైనా కామెంట్ చేస్తాడో చూడాలి.