Dhanush : విడాకుల తర్వాత ఐశ్వర్య పై ఫ్రెండ్ అంటూ ధనుష్ ట్వీట్

విడిపోయాక ధనుష్‌-ఐశ్యర్యలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అనుకోకుండా రెండు సార్లు ఒకరికొకరు ఎదురుపడ్డా కనీసం పలకరించుకోలేదు. అయితే విడాకుల అనంతరం తొలిసారి మాజీ భార్యపై ట్వీట్‌..

Dhanush : విడాకుల తర్వాత ఐశ్వర్య పై ఫ్రెండ్ అంటూ ధనుష్ ట్వీట్

Dhanush

 

Aishwaryaa :  కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌-ఐశ్యర్య ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరు విడిపోవడాన్ని ఫ్యాన్స్‌ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. 18 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకుని అందరికి షాకిచ్చారు. ఇక విడిపోయాక ధనుష్‌-ఐశ్యర్యలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అనుకోకుండా రెండు సార్లు ఒకరికొకరు ఎదురుపడ్డా కనీసం పలకరించుకోలేదు. అయితే విడాకుల అనంతరం తొలిసారి మాజీ భార్యపై ట్వీట్‌ చేశాడు ధనుష్‌.

ఇటీవల ఐశ్యర్య దర్శకత్వంలో ఓ మ్యూజిక్ వీడియోని రూపొందించింది. ఈ మ్యూజిక్‌ వీడియోలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్, ఢీ ఫేం శ్రష్టి జంటగా నటించారు. ఈ వీడియో తమిళ వెర్షన్‌ ‘పయని’ని తాజాగా సూపర్‌‌స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా, తెలుగు వెర్షన్ ‘సంచారి’ని అల్లు అర్జున్, మలయాళ వర్షన్ ‘యాత్రక్కారి’ని మోహన్‌‌లాల్ రిలీజ్ చేశారు. ధనుష్ ఈ వీడియోని షేర్ చేస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

RGV : ‘రాధేశ్యామ్’కి అంత బడ్జెట్ అవసరం లేదు.. ఆర్జీవీ కామెంట్స్..

ఈ వీడియో రిలీజ్ సందర్భంగా ఐశ్యర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ధనుష్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ గా మారింది. ఈ మ్యూజిక్‌ వీడియోను ధనుష్‌ షేర్ చేస్తూ.. ”పయని మ్యూజిక్‌ వీడియోకు దర్శకత్వం వహించిన నా స్నేహితురాలు ఐశ్యర్యకు శుభాకాంక్షలు. గాడ్‌ బ్లెస్‌’’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ట్వీట్ లో ఐశ్వర్యని ఫ్రెండ్ అంటూ సంభోదించడంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.