Dil Raju : వారసుడు థియేటర్స్ వివాదంపై మొదటిసారి మాట్లాడిన దిల్ రాజు..

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'వారిసు'ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై వివాదం నడుస్తుండగా, దిల్ రాజు 'మసూద' సక్సెస్ మీట్ లో మొదటిసారి నోరు విప్పాడు..

Dil Raju : వారసుడు థియేటర్స్ వివాదంపై మొదటిసారి మాట్లాడిన దిల్ రాజు..

Dil Raju comments on varisu controversy

Dil Raju : తమిళ నటుడు విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’ పేరుతో డబ్ అవ్వుతుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మొదట ఈ సినిమాను బైలింగ్వల్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించినా, ఆ తరువాత ఈ సినిమా కంప్లీట్ తమిళ మూవీ అంటూ ప్రకటన చేశారు.

Varisu : తమిళ్, తెలుగు ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టిన ‘వరిసు’

ఇక్కడే అసలు వివాదం రాచుకుంది. డబ్బింగ్ సినిమాగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే అదే సమయంలో విడుదలవుతున్న చిరు, బాలయ్య సినిమాలకు థియేటర్లు కేటాయించకుండా, డబ్బింగ్ సినిమా అయిన వారిసుకు ఎక్కువ మొత్తంలో థియేటర్లు ఇవ్వడంతో తెలుగు నిర్మాత మండలి ఫైర్ అయ్యింది. కాగా ఈ విషయంపై దిల్ రాజు మొదటిసారి మీడియా ముందు మాట్లాడాడు.

నటి సంగీత నటించిన ‘మసూద’ సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. “దిల్ రాజు సినిమాలను తొక్కేస్తాడు అని చాలామంది అంటుంటారు. కానీ నాకు ఇంకో సైడ్ ఉంది. మంచి కంటెంట్ తో సినిమాలు చేసే వారికోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. ఆ క్రమంలోనే తమిళ మూవీ ‘లవ్ టుడే’ని డబ్ చేసి విడుదల చేస్తున్నా. అందులో నాకు మిగేలేదు ఏమి ఉండదు. కానీ సినిమా మీద ప్రేమతో, ప్యాషన్ తో విడుదల చేస్తున్నాను. అసలు వారిసు విషయంలో జరిగింది వేరు, ఆ విషయాలన్నీ నేను త్వరలో ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తాను” అని వెల్లడించాడు.