Dil Raju : ఆల్రెడీ గెలికింది చాలు.. మీడియాకి దిల్ రాజు కౌంటర్!

రెండు రోజులు క్రితం దిల్ రాజు ఒక ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ సూపర్ స్టార్ 'అజిత్'ని తక్కువ చేసి మాట్లాడడంతో తమిళ సినీ పరిశ్రమంలో తీవ్ర దుమారాన్ని లేపింది. ఈ క్రమంలోనే నిన్న 'బలగం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. ఈ కాంట్రవర్సి గురించి దిల్ రాజుని ప్రశ్నించారు విలేకర్లు. దానికి దిల్ రాజు..

Dil Raju : రెండు రోజులు క్రితం దిల్ రాజు ఒక ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ సూపర్ స్టార్ ‘అజిత్’ని తక్కువ చేసి మాట్లాడడంతో తమిళ సినీ పరిశ్రమంలో తీవ్ర దుమారాన్ని లేపింది. తమిళ హీరో విజయ్ తో ఈ స్టార్ ప్రొడ్యూసర్ ‘వారిసు’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం.. అజిత్ ‘తునివు’ సినిమాతో సంక్రాంతికి విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమాల థియేటర్ల కేటాయింపులో దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేశాడు.

Dil Raju : మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు..

‘అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్’ అంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్ తెలుగు, తమిళ భాషల్లో టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే నిన్న ‘బలగం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. ఈ కాంట్రవర్సి గురించి దిల్ రాజుని ప్రశ్నించారు విలేకర్లు. దానికి దిల్ రాజు.. ‘మీ మీడియా వాళ్ళు ఏదోకటి గెలుకుతుంటారు. ఇప్పుడూ గెలకండి, ఆల్రెడీ గెలికింది చాలు’ అంటూ మీడియాకి కౌంటర్ ఇచ్చాడు.

“మీడియా వాళ్ళ ముందు ఏది మాట్లాడాలి అన్న భయం వేస్తుంది. నేను ఏది మాట్లాడినా, దాని కాంట్రవర్సి చేస్తున్నారు. మొన్న నేను ఒక ఛానల్‌కి ఇచ్చిన 35 నిమిషాల ఇంటర్వ్యూలో.. కావాలని ఒక 20 సెకండ్స్ వీడియోని మాత్రం రిలీజ్ చేశారు. కానీ దాని మొత్తంగా చూస్తే అందరికి అర్ధమవుతుంది. నేను ఒకరిని ఎక్కువ చేసి, మరొకరిని తక్కువ చేసి మాట్లాడలేదు. దయచేసి దీని కాంట్రవర్సి చేయకండి, మీడియా వాళ్లకి ఇది నా విన్నపం” అంటూ వ్యాఖ్యానించాడు.

ట్రెండింగ్ వార్తలు