మాజీ భార్యతో సినిమా చేస్తా.. ఈ సినిమా విజయమే అందుకు నిదర్శనం: స్టార్ హీరో
ఏదైనా కేసులో ఇరుక్కుంటే ఇక వారి కెరీర్ అయిపోయినట్లే అని భావిస్తారు. స్టార్ హీరో స్టేటస్తో ఉండి ఓ హీరోయిన్ కిడ్నాప్ ఆరోపణలపై అరెస్ట్ అయిన మలయాళ స్టార్ హీరో దిలీప్కుమార్ సినిమా కెరియర్ ఇక ముగిసినట్లే అని అందరూ భావించారు. అయితే అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరోగా తీసిన సినిమా ‘మై శాంటా’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.
ఈ క్రమంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు దిలీప్ కుమార్. ఈ సంధర్భంగా తన మాజీ భార్య నటి మంజు వారియర్తో కలిసి నటించడంపై కూడా వివరాలు వెల్లడించారు. ‘మంజుతో కలిసి నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ స్ర్కిప్ట్ డిమాండ్ చేస్తే తనతో కలిసి తప్పకుండా నటిస్తాను. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి వైరం లేదు’ అని దిలీప్ స్పష్టం చేశారు.
అనంతరం ఆయన ‘మై శాంటా’ విజయంపై మాట్లాడారు. ‘నా మీద ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పుడు నేనింకా పరిశ్రమలో ఉండనని చాలామంది అనుకున్నారు. ప్రేక్షకులు నన్ను అభిమానిస్తున్నారని ‘మైశాంటా’తో నిరూపితం అయ్యింది అన్నారు. ఇందుకు నాకెంతో సంతోషంగా ఉందని. నాకింత మంచి అభిమానులను సొంతం చేసినందుకు దేవుడికి నమస్కరిస్తున్నాను. ఏదో ఒకరోజు నిజం దానంతట అదే బయటపడుతుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం సినిమా ఒక్కటే నా ఆలోచన’ అని ఆయన అన్నారు.
మలయాళ నటి లైంగిక వేధింపుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న దిలీప్ ఆ కేసు జరుగుతున్న సమయంలో గొడవలు జరిగాయి. దిలీప్ మాజీ భార్య నటి మంజూ.. అని అందరికీ తెలుసు. ఈమెతో 2015లో విడాకులు చేసుకొని 2016లో రెండో భార్యగా నటి కావ్య ను దిలీప్ పెళ్లిచేసుకున్నాడు. కేరళలో మళయాళ నటి కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.