ప్రభాస్ 21.. ప్యాన్ ఇండియా కాదు.. అంతర్జాతీయ సినిమా..

ప్రభాస్ 21 ‘ప్యాన్ వరల్డ్’ సినిమా - దర్శకుడు నాగ్ అశ్విన్..

  • Published By: sekhar ,Published On : February 27, 2020 / 07:04 AM IST
ప్రభాస్ 21.. ప్యాన్ ఇండియా కాదు.. అంతర్జాతీయ సినిమా..

ప్రభాస్ 21 ‘ప్యాన్ వరల్డ్’ సినిమా – దర్శకుడు నాగ్ అశ్విన్..

సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 50 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో ఓ సినిమా నిర్మించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

తండ్రి అశ్వనీదత్‌తో కలిసి  స్వప్నా దత్, ప్రియాంక దత్ నిర్మించనున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా ఇది. ‘‘ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. ప్రభాస్‌ గారికి థ్యాంక్స్‌. ప్రస్తుతానికి సినిమా గురించి ఏం చెప్పదల్చుకోలేదు. కొతంమంది ప్యాన్ ఇండియా సినిమా అంటున్నారు. అది తప్పు.. ప్రభాస్ ప్యాన్‌ ఇండియా ఎప్పుడో కొట్టేశారు.. ఇది ప్యాన్‌ వరల్డ్‌ డార్లింగ్స్’’ అని ట్వీటారు డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌.

‘సాహో’ తర్వాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘రాధేశ్యామ్’ టైటిల్ ప్రచారంలో ఉంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కోసం సాలిడ్ స్టోరి రెడీ చేసాడని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.