Parasuram : నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి అని మెసేజ్ పెట్టారు మహేష్

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ పరశురామ్ మాట్లాడుతూ.. గీతా గోవిందం తర్వాత సర్కారు వారి పాట కథ రాసుకొని కొరటాల శివ గారి ద్వారా మహేష్ గారిని కలిశాను. బాబు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు............

Parasuram : నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి అని మెసేజ్ పెట్టారు మహేష్

Director

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

Producers : శ్రీమంతుడు సినిమా నుంచి మహేష్ మాకు సపోర్ట్ చేస్తున్నారు

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ పరశురామ్ మాట్లాడుతూ.. గీతా గోవిందం తర్వాత సర్కారు వారి పాట కథ రాసుకొని కొరటాల శివ గారి ద్వారా మహేష్ గారిని కలిశాను. బాబు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు భయమేసింది. ఆయనకి కథ చెప్పినప్పుడు ఆయన ఫేస్ లో చిన్న స్మైల్ కనిపించింది. ఆ స్మైల్ నాకు ధైర్యాన్నిచ్చింది. నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి అని మెసేజ్ పెట్టారు మహేష్. ఆ మెసేజ్ నన్ను ఇక్కడి దాకా నడిపించింది. నేను చేయగలిగినంత చేశాను. నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ సర్. ఈ సినిమాకి అడిగినవన్నీ ఇచ్చారు నా నిర్మాతలు. ఈ సినిమాకి పని చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మూడున్నర సంవత్సరాలుగా కష్టపడ్డాం. ఇన్ని సంవత్సరాలుగా నాకు సపోర్ట్ ఉన్న నా డైరెక్షన్ టీంకి చాలా థ్యాంక్స్. ఈ సినిమా జర్నీ నేను, తమన్ లాక్ డౌన్ లో మొదలుపెట్టాం. రీరికార్డింగ్ కూడా చంపేశాడు తమన్. మూడు సంవత్సారాలు ఈ సినిమా కోసం నా ఫ్యామిలీని మిస్ అయ్యాను. ఈ సినిమాతో పెద్ద సక్సెస్ కొడుతున్నాం” అని తెలిపారు.