మంజు.. ఇది మంచి పద్ధతి కాదు, నిజాలు బయటపెడతా..

మలయాళ నటి మంజు వారియర్ తనపై చేసిన ఆరోపణల గురించి దర్శకుడు శ్రీకుమార్ మీనన్ సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయ్యాడు..

  • Published By: sekhar ,Published On : October 24, 2019 / 05:47 AM IST
మంజు.. ఇది మంచి పద్ధతి కాదు, నిజాలు బయటపెడతా..

మలయాళ నటి మంజు వారియర్ తనపై చేసిన ఆరోపణల గురించి దర్శకుడు శ్రీకుమార్ మీనన్ సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయ్యాడు..

పాపులర్ మలయాళ నటి మంజు వారియర్, డైరెక్టర్ శ్రీ కుమార్ మీనన్‌పై త్రిసూర్ ఈస్ట్ పీఎస్‌లో కంప్లైంట్ చేసింది.. ఆమె చేసిన ఫిర్యాదుపై రీసెంట్‌గా కుమార్ స్పందించాడు. శ్రీకుమార్‌ దర్శకత్వంలో, ‘కంప్లీట్ యాక్టర్’ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘ఒడియన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో శ్రీకుమార్‌ తనను అసభ్యంగా దూషించాడని.. తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశాడని పోలీసులకు మంజు ఫిర్యాదు చేశారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లగొడతానని ఒకసారి, ఆ తర్వాత చంపేస్తానని మరోసారి శ్రీకుమార్ తనను బెదిరించాడని, సోషల్‌ మీడియాలో తన గురించి అసత్యాలు ప్రచారం చేసి పరువుకు భంగం కలిగించాడని.. తన స్నేహితులను కూడా అతను బెదిరించాడని ఆమె కంప్లైంట్‌లో మెన్షన్ చేస్తూ.. కొన్ని ఫోటోలను పోలీసులకు అందచేశారు. మంజు ఆరోపణల గురించి శ్రీకుమార్ సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయ్యాడు.

Read Also : నాని నిర్మాతగా ‘హిట్’ ప్రారంభం

‘నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు నేను మాత్రమే హెల్ప్ చేశాననే విషయాన్ని ఎలా మర్చిపోగలిగావ్? నా వళ్లే నీకు చాలామందితో పరిచయం ఏర్పడింది.. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావ్.. నువ్వు నాపై కేసు పెట్టిన విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నాను.. కచ్చితంగా పోలీసులకు సహకరిస్తాను.. విచారణలో నీకూ, మంజు వారియర్‌కి మాత్రమే తెలిసిన ఎన్నో నిజాలను బయటపెడతాను’ అంటూ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకుమార్. ఇటీవల మంజు వారియర్, ధనుష్‌తో నటించిన ‘అసురన్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఆమె భర్త దిలీప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.