DJ Tillu : సినిమా రిలీజ్ అవ్వకుండానే సీక్వెల్ ప్లానింగ్..

‘డిజె టిల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ''కృష్ణ అండ్‌ హిజ్‌ లీల సినిమా చూశాక అది నచ్చి సిద్ధు జొన్నలగడ్డను పిలిచాను. అప్పుడు ‘డిజె టిల్లు’ అనే...

DJ Tillu :  సినిమా రిలీజ్ అవ్వకుండానే సీక్వెల్ ప్లానింగ్..

Dj Tillu

DJ Tillu :  హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహా శర్మ జంటగా నటించిన సినిమా ‘డిజె టిల్లు’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. యూత్ ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుంది. విమల్ కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించారు. ‘డిజె టిల్లు’ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా నిన్న ‘డిజె టిల్లు’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.

Chiranjeevi : ఒకే ఫ్రేమ్‌లో మెగా, సూపర్, రెబల్ స్టార్స్.. అదిరిపోయిన ఫోటో..

‘డిజె టిల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ”కృష్ణ అండ్‌ హిజ్‌ లీల సినిమా చూశాక అది నచ్చి సిద్ధు జొన్నలగడ్డను పిలిచాను. అప్పుడు ‘డిజె టిల్లు’ అనే యూత్‌ఫుల్‌ కథ చెప్పాడు. ఈ కథ వింటున్నంత సేపూ నేను చాలా నవ్వుకున్నాను. సినిమా చూసి ప్రేక్షకులు కూడా ఫుల్‌గా నవ్వుకుంటారు. మేము ఓ కథ ఓకే అనుకున్నాక డైరెక్టర్‌ త్రివిక్రమ్‌గారికి చెబుతాం. ఆయన కథలో మార్పులు, సలహాలు చెబుతారు. ‘డిజె టిల్లు’ పూర్తయ్యాక కూడా త్రివిక్రమ్‌గారు చెప్పడంతో కొన్ని సన్నివేశాలు మళ్లీ తీశాం. కరోనా టైమ్‌లో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మేం నిర్మించిన ‘రంగ్‌ దే, వరుడు కావలెను’ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువగా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని రప్పించాలంటే ‘డిజె టిల్లు’ లాంటి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలే అవసరం. ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే ఆలోచన ఉంది. రిలీజ్ అయిన తర్వాత ఇది మంచి విజయం సాధిస్తుంది. అందుకే దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము” అని తెలిపారు.