ఏప్రిల్ 2న ‘ఉప్పెన’

పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్ట జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’ ఏప్రిల్ 2న బ్రహ్మాండమైన విడుదల..

ఏప్రిల్ 2న ‘ఉప్పెన’

Drench Ocean Love April 2nd 2020 24452

పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్ట జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’ ఏప్రిల్ 2న బ్రహ్మాండమైన విడుదల..

మరో మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది.

కృతి శెట్టి కథానాయికగా, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా హీరోయిన్ కృతి శెట్టి పోస్టర్ రిలీజ్ చేశారు. వర్షంలో పరవశంతో తడుస్తూ ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Read Also : ‘చూసీ చూడంగానే’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్

‘ఉప్పెన’ చిత్రాన్ని 2020 ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. కెమెరా : శ్యామ్ దత్ సైనుద్దీన్, ఎడిటింగ్ : నవీన్ నూలి, నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, సుకుమార్.