Drugs Case: డ్రగ్స్ కేస్ ఎఫెక్ట్.. సంజనా హాస్పటిల్‌లో అడ్మిట్!

డ్రగ్స్ కేస్ ఇండియన్ సినీ పరిశ్రమలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసు ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపుతూనే ఉండగా తాజాగా మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో..

Drugs Case: డ్రగ్స్ కేస్ ఎఫెక్ట్.. సంజనా హాస్పటిల్‌లో అడ్మిట్!

Drugs Case

Drugs Case: డ్రగ్స్ కేస్ ఇండియన్ సినీ పరిశ్రమలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసు ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపుతూనే ఉండగా తాజాగా మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో దర్యాప్తు కమిటీ జులైలో కోర్టుకు ఛార్జిషీట్లు దాఖలు చేయగా.. తాజాగా ఈడీ రంగంలోకి దిగి ఈ కేసుతో సంబంధం ఉన్న12 మందికి బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకూ వీరిని విచారించనుంది.

ఇప్పటికే నటీమణులు రాగిణి, సంజనా గల్రానిలు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుక నమూనాలను బెంగుళూరు పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కు పంపగా.. వాటిని పరీక్షించిన తర్వాత ఇద్దరు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో పేర్కొంది. దీంతో ఈ కేసు ఇప్పుడు కీలకంగా మారింది. అయితే, దీని ప్రభావం ఎలా ఉండబోతుందని చర్చ జరుగుతుండగానే నటి సంజనా ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది.

డ్రగ్స్‌ కేసులో నిందితురాలిగా ఉన్న సంజనా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరినట్లు ఆమె తల్లీ రేష్మా గల్రాని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె అన్నింటికీ తలరాత బాగుండాలని.. మేం ఎలాంటి తప్పు చేయలేదు. పేదలకు రోజూ అన్నదానం చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. మరో కన్నడ నటి రాగిణి ద్వివేది మీడియా ముందుకు రాకపోయినా సోషల్ మీడియాలో ఈ కేసుపై స్పందించింది. దేవుడు వేసిన ప్లాన్‌పై మనకు భరోసా ఉండాలి. అనుకున్నట్లు నడవకపోయినా కోపం ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం అని ఇన్‌స్టాగ్రాంలో రాగిణి పోస్ట్‌ చేసింది.