Sachin Joshi : నటుడు, నిర్మాత సచిన్ జోషి ఆస్తులని జప్తు చేసిన ఈడీ
సినీ నటుడు, నిర్మాత సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన ఆస్తులను జప్తు చేసింది. సచిన్ జోషి 2002లో వచ్చిన 'మౌనమేలనోయి'..
Sachin Joshi : సినీ నటుడు, నిర్మాత సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన ఆస్తులను జప్తు చేసింది. సచిన్ జోషి 2002లో వచ్చిన ‘మౌనమేలనోయి’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, నీజతగా నేనుండాలి, వీడెవడు… లాంటి తెలుగు సినిమాల్లో నటించాడు. బాలీవుడ్లో కూడా పలు సినిమాలు చేశాడు. తెలుగులో ‘నెక్ట్స్ ఏంటి’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. కొన్ని సినిమాలకి ఫైనాన్స్ కూడా అందించారు.
Lasya : నాన్నకి ఇళ్లు కట్టిస్తున్నయాంకర్ లాస్య
తాజాగా సచిన్ జోషికి సంబంధించిన రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందులో రూ.330 కోట్ల వరకు ఓంకార్ గ్రూప్కు చెందిన ఆస్తులు కాగా, మిగిలిన రూ.80 కోట్లు వైకింగ్ గ్రూప్ కంపెనీకి చెందినవని ఈడీ వెల్లడించింది. ఎస్ఆర్ఏ అనే ప్రాజెక్టులో భాగంగా సచిన్ జోషికి చెందిన ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా సచిన్ జోషి ఆస్తులని జప్తు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.