Eeshwari Rao : ప్రభాస్, సలార్ సినిమాపై నటి ఈశ్వరీరావు కామెంట్స్..

ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా సలార్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. 2023 ద్వితీయార్థంలో ఈ సినిమాని.............

Eeshwari Rao : ప్రభాస్, సలార్ సినిమాపై నటి ఈశ్వరీరావు కామెంట్స్..

Eeshwari Rao comments on Prabhas and Salaar

Eeshwari Rao :  ఒకప్పుడు సినిమాల్లో, సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన ఈశ్వరీరావు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. ఇటీవల చాలా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తుంది. KGF సినిమాలో ఈశ్వరీరావు చేసిన పాత్రకి మంచి స్పందన వచ్చింది. దీంతో ప్రశాంత్ నీల్ ఈశ్వరీరావుని సలార్ సినిమాలో కూడా తీసుకున్నాడు.

ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా సలార్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. 2023 ద్వితీయార్థంలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న ఈశ్వరీరావు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్, ప్రభాస్ గురించి మాట్లాడింది.

Adivi Sesh : అడవిశేష్ 350 కోట్లు సంపాదించాడా?? తన రెమ్యునరేషన్ పై శేష్ క్లారిటీ..

ఈశ్వరీరావు మాట్లాడుతూ.. ప్రభాస్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ సెట్లో చాలా వినయంగా, సైలెంట్ గా ఉంటాడు. సినిమాలో నాకు, ప్రభాస్ కి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. మా ఇద్దరి సీన్స్ చాలా భావోద్వేగంతో ఉంటాయి. ఆ సీన్స్ ఎమోషనల్ గా అందరికి కనెక్ట్ అవుతాయి అని చెప్పింది.