సెప్టెంబర్ 8న ‘సినీ మహోత్సవం – రథసారధుల రజతోత్సవం’

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. 'సినీ మహోత్సవం - రథసారధుల రజతోత్సవం' పేరుతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది.

  • Published By: sekhar ,Published On : August 27, 2019 / 07:41 AM IST
సెప్టెంబర్ 8న ‘సినీ మహోత్సవం – రథసారధుల రజతోత్సవం’

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ‘సినీ మహోత్సవం – రథసారధుల రజతోత్సవం’ పేరుతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది.

తారలు దిగివచ్చిన వేళ.. సినీ ప్రేక్షకుల ఆనంద హేల.. వెండితెరపై తమ నటనతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే ఆర్టిస్టులందరూ ఒకే వేదికపై కనిపించడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంటుంది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ‘సినీ మహోత్సవం – రథసారధుల రజతోత్సవం’ పేరుతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది.

రీసెంట్‌గా కర్టన్ రైజర్ ఈవెంట్ నిర్వహించి, కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి, సి.కళ్యాణ్, జెమినీ కిరణ్, డా.రాజశేఖర్, అల్లరి నరేష్, సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ‘సినీ మహోత్సవం – రథసారధుల రజతోత్సవం’ సెప్టెంబర్ 8వ తేదీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది.

Read Also : 2020 రంజాన్‌కు ‘లక్ష్మీబాంబ్’..

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహా బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఆది, ఆది సాయి కుమార్, సందీప్ కిషన్, రాశీ ఖన్నా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్, రెజీనా, అనసూయ తదితరులు అటెండ్ అవనున్నారు. త్వరలో పాస్‌లు ఆన్ లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి.