సీరియల్ నటి ఘనకార్యం : దోమల్ని చంపబోయి.. ఇల్లు కాల్చేసుకుంది
ముంబై : అనుకున్నదొక్కటి..జరిగిందొకటి అన్నట్లు ఉంటాయి కొన్ని సందర్భాలు. ఇటువంటివి ఒకోసారి ప్రాణమీదికి తెచ్చిపెడతాయి. ఈ క్రమంలో దోమల్ని చంపేందుకు చేసిన పనితో ఇల్లే కాలిపోయింది. ఈ ఘటనలో ఓ నటి తృటిలో ప్రమాదం నుంచి బైటపడింది. హిందీ సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌమ్య టాండన్ దోమల బాధ నుంచి తప్పించుకునేయత్నంలో ప్రమాదం సంభవించింది.
తన బెడ్ రూమ్ లో దోమలను పారదోలేందుకు మస్కిటో రిపెల్లెంట్ ఆన్ చేసి సౌమ్యా టాండర్ అలాగే నిద్రలోకి జారుకుంది. మత్తుగా నిద్ర పట్టేయటంతో మస్కిటో రిపెల్లెంట్ ఆఫ్ చేయలేదు. దీంతో ఆ రిపెల్లెంట్ లో మంటలు చెలరేగాయి..అతి కొద్ది సమయంలోనే ఇంట్లో మంటలు వ్యాపించాయి. వేడి సెగ తగలటంతో హఠాత్తుగా మెలకువ వచ్చి చూసేసరికి మంటలు వ్యాపించటంతో ఒక్కసారిగా షాక్ తింది. అప్పటికే రూమ్ లో చాలావరకు వ్యాపించిన మంటలను అతికష్టమ్మీద ఆర్పేసింది. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఇంట్లో తనతోపాటు ఉంటున్న బామ్మతోపాటు ఎటువంటి గాయాలు లేకుండానే సౌమ్యా సురక్షితంగా బయటపడింది.
భాబీజీ ఘర్ పర్ హై అనే సీరియల్ తో ఉత్తరాది రాష్ట్రాల్లో సౌమ్య టాండన్ ఎంతో పాప్యులర్ అయిన ఆమె ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్పందిస్తు..ఈ ప్రమాదం ద్వారా తాను మూడు గుణపాఠాలు నేర్చుకున్నానని సోషల్ మీడియాలో వెల్లడించింది. బెడ్ పక్కనే మస్కిటో రిపెల్లెంట్ ను ఎప్పుడూ పెట్టుకోకూడదని.. లూజ్ కనెక్షన్ ఉన్న వస్తువులను ఎప్పుడూ ప్లగ్ చేయకూడదని, అగ్నిమాపక ఉపకరణాలను ఎల్లవేళలా ఇంట్లో ఉంచుకోవాలని తాను ఈ ఘటనతో నేర్చుకున్నానని వివరించింది.
Lots of mistakes, was so rushed, ‘liquid repellent’ ? https://t.co/dVxYytUZnz
— Saumya Tandon (@saumyatandon) February 21, 2019
Read Also: గుండెల్ని పిండేసే ఘటన : అమర జవానుకు భార్య చివరి ముద్దు
Read Also: సినిమా రివ్యూ : ఎన్టీఆర్ మహానాయకుడు
Read Also: ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : సీఎం కేసీఆర్