Bigg Boss 5 : బిగ్‌బాస్ ఫైనల్‌కి చేరిన ఫస్ట్ కంటెస్టెంట్

'టికెట్‌ టు ఫినాలే' టాస్క్‌లో కంటెస్టెంట్స్ అంతా అయిదు ఛాలెంజ్‌ లను పూర్తి చేశారు. ఈ టాస్కులన్నీ పూర్తయ్యేసరికి మానస్‌, శ్రీరామ్‌, సిరి, సన్నీలు వరుస నాలుగు స్థానాల్లో....

Bigg Boss 5 : బిగ్‌బాస్ ఫైనల్‌కి చేరిన ఫస్ట్ కంటెస్టెంట్

Sreeram

Bigg Boss 5 :  బిగ్ బాస్ ఆఖరి దశలో ఉంది. ఇంకో రెండు వారాల్లో బిగ్ బాస్ ముగుస్తుంది. ప్రస్తుతం ఎవరు ఫైనల్ కి వెళ్తారు అనే టాస్కులు జరుగుతున్నాయి. బిగ్‌బాస్‌ షోలో నిన్నటి దాకా ముఖ్యమైన ‘టికెట్‌ టు ఫినాలే’ టాస్క్‌ జరిగింది. ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు డైరెక్ట్ గా ఫైనల్ కి అర్హత సాధించినట్లే. అయితే ఇందులో ఎవరు గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ టాస్కులు నిన్నటితో పూర్తి అయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరో తెలిసిపోయింది.

Bigg Boss 5 : నీ సొంత వైద్యం ప్రయత్నించకు.. ప్రియాంకకి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్

‘టికెట్‌ టు ఫినాలే’ టాస్క్‌లో కంటెస్టెంట్స్ అంతా అయిదు ఛాలెంజ్‌ లను పూర్తి చేశారు. ఈ టాస్కులన్నీ పూర్తయ్యేసరికి మానస్‌, శ్రీరామ్‌, సిరి, సన్నీలు వరుస నాలుగు స్థానాల్లో నిలిచారు. దీంతో చివరి ఇద్దర్ని తప్పించి ఫైనల్ టాస్క్ లో మొదటి ఇద్దరికి పోటీ పెట్టాడు బిగ్ బాస్. దాంతో మానస్, శ్రీరామ్ లు ఈ ఫైనల్ టాస్క్ లో పోటీపడ్డారు.

Bigg Boss Manas : మానస్ కోసం తరలి వస్తున్న తారలు.. మరో వైపు బిగ్ బాస్ మాజీ విన్నర్ కూడా..

ఆఖరి రౌండ్‌లో శ్రీరామ్‌, మానస్‌ పోటీపడగా శ్రీరామ్‌ విజయం సాధించాడు. దీంతో బిగ్ బాస్ ఫైనల్ కి చేరిన ఫస్ట్ కంటెస్టెంట్ గా శ్రీరామ్ నిలిచాడు. ఈ రౌండ్ గెలిచాక శ్రీరామ్ మాట్లాడుతూ.. నా కాళ్ళు బాగోలేకపోవడంతో షణ్ను, సన్నీ ఇద్దరూ తన గెలుపుకు సాయం చేశారని వారికి అభినందనలు అని తెలిపాడు. ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయ్యాను అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు శ్రీరామ్.