కాజల్-గౌతం పెళ్లి: పదేళ్ల పరిచయం తర్వాతే ఓకే చెప్పా..!
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ని కొద్ది రోజుల క్రితం అక్టోబర్ 30న పెళ్లి చేసుకుందని తెలుసు. ముంబైలోని ప్లష్ హోటల్ వేదికగా జరిగిన కాజల్-గౌతంల వెడ్డింగ్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాలు ప్రేమలో ఉన్నారో అంతకంటే.. ముందు ఎన్ని రోజుల స్నేహమో గౌతం భార్యగా ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ..
ఏడేళ్ల స్నేహం తర్వాత డేటింగ్:
తనకు చాలా బెస్ట్ ఫ్రెండ్ గౌతం కిచ్లు. ఒకరికొకరు ఏడు సంవత్సరాలుగా స్నేహితులు. ఈ మహమ్మారి వ్యాప్తి సమయంలో వారి బంధం మరో అడుగు ముందుకేసేలా చేసింది. డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ నడుపుతున్నాడు గౌతం.
కామన్ ఫ్రెండ్స్ ద్వారా.. వారిద్దరూ 10ఏళ్ల క్రితమే కలిశారు. ‘గౌతం నేనూ మూడేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నాం. అంతకంటే ముందు ఏడేళ్లుగా స్నేహితులం కూడా. మా జీవితాల్లో ప్రతి దశలో స్నేహితులుగానే ట్రావెల్ చేశాం’ అని కాజల్ అగర్వాల్ చెప్పింది.
కరోనా టైంలోనే పెళ్లి ఫిక్స్:
కాజల్ అగర్వాల్, గౌతం కిచ్లు కలుసుకుందామనుకుంటే కరోనా లాక్ డౌన్ అడ్డుపడిందట. అప్పుడే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ‘ఇది సోషల్ పార్టీ లేదా ముఖ్యమైన ప్రొఫెషనల్ పని అయితే బయటకు చెప్పుకోచ్చు. కానీ, లాక్ డౌన్ సమయంలో మేం ఒకరినొకరు కలుసుకోవడం కాదు కొద్ది వారాల పాటు చూసుకోలేదు కూడా. ఎట్టకేలకు మాస్క్ లు కట్టుకుని గ్రోసరీ స్టోర్ లో కలిశాం. అప్పుడే అనిపించింది మేం కలిసి బతకాలని’ అని చెప్పింది కాజల్.
గౌతం సినిమా వాడు కాకపోవడం తనకు చాలా థ్యాంక్ఫుల్గా ఉందట. గౌతం నుంచి వచ్చిన ప్రపోజల్ కు కాజల్ వెంటనే యస్ చెప్పేశాను అని చెప్పింది.
గౌతం అర్థం చేసుకుంటాడు.. సినిమాలకు నో బ్రేక్:
‘రొమాన్స్ గురించి వస్తే గౌతం అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే అతను సినిమాల గురించి పట్టించుకోడు. సినిమాలు చేసుకోవడానికి సరిపడ సమయం దొరికినట్లే. ఇది కేవలం ప్రపోజల్ మాత్రమే కాదు. అంతకుమించి మనస్సుతో చేసిన పని. మా ఇద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ సంభాషణ అది. అతని ఫీలింగ్స్ చెప్పి నాతో భవిష్యత్ కలిసి గడపాలనుకుంటున్నట్లు చెప్పాడు. అతనితో నేను కలిసి గడుపుతానని అంత కచ్చితంగా అనుకోలేదని కాజల్ బయటపెట్టేసింది.
అనుకున్నదొకటి అయిందొకటి:
కాజల్ పేరెంట్స్ను గౌతం ఏప్రిల్ 2020న కలిశాడు. జూన్ లోనే వారి నిశ్చితార్థం జరిగింది. కాజల్ కు డిస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని, ఫ్లోర్ మొత్తం డ్యాన్స్ గుంపులతో నిండిపోవాలని అనుకునేదట. ఆ ప్లాన్స్ అన్నింటినీ కరోనావైరస్ చెడగొట్టేసింది.
కాజల్, గౌతం, నిషా అగర్వాల్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెహందీ, హల్దీ, ఈవెంట్లకు వాట్సప్, జూమ్ కాల్స్లో డిజైన్ చేశారట.
అలా జరిగింది:
అక్టోబర్ 29న మొదలైన మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, చున్నీ సంబరం లతో అక్టోబరు30న మూడు ముళ్లతో ముగిసింది. పంజాబ్, కశ్మీరీ పద్ధతుల ప్రకారం వారి పెళ్లి తంతు ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎక్కువ కాలం ఉండటంతో ఆమెకు జీలకర్ర, బెల్లంపై కూడా నమ్మకం పెరిగి ఆ పద్ధతి కూడా పూర్తి చేశారట.
కాజల్ వర్క్ కమిట్మెంట్స్ కారణంగా హనీమూన్ ప్లాన్ వాయిదావేసేసింది. త్వరలోనే వారు కొత్త ఇంటికి షిఫ్ట్ అవనున్నారట.