ఏమాయ చేసావే సీక్వెల్..శింబు ఒకే అంటే – గౌతమ్ మీనన్

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 03:25 AM IST
ఏమాయ చేసావే సీక్వెల్..శింబు ఒకే అంటే – గౌతమ్ మీనన్

టాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించిన ‘ఏ మాయ చేసావే’ ఫిల్మ్ సీక్వెల్ రూపొందుతోందని గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. త్రిష, శింబు కాంబినేషన్ లో ‘విన్నెతాండి వరువాయ’ చిత్రాన్ని తెలుగులో రీమెక్ చేశారు. గౌతమ్ మీనన్ దీనికి దర్శకత్వం వహించారు. తెలుగులో నాగ చైతన్య, సమంతలు నటించారు. ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై ఘట్టమనేని మంజుల నిర్మాతగా..గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ..మంచి సక్సెస్ ని సాధించింది.

2010లో ఈ సినిమా విడుదలైంది. శింబు కనుక ఒకే అంటే..‘విన్నైతాండి వరువాయ’ సీక్వెల్ ను తెరకెక్కిస్తానని, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి కథ రాస్తున్నానని గౌతమ్ వెల్లడించారు. ఈ సినిమా గురించి ఆయన స్పందించారు. ఓ హిట్ సినిమాను మరలా తెరకెక్కించాలంటే..ఫిల్మ్ మేకర్ ఎన్నో ఇబ్బందులను, ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సీక్వెల్ ను రూపొందించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందని, అనుకున్న కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు సరిగ్గా అందచేయడం కోసం కొంత ఒత్తిడికి గురవుతున్నానని తెలిపారు. ఎంత ఒత్తిడికి గురైనా..తప్పకుండా సీక్వెల్ ను రూపొందిస్తానని గౌతమ్ మీనన్ వెల్లడించారు. 

Read: ఏపీలో చిత్ర పరిశ్రమకు చేయూతనివ్వండి: సీఎం జగన్‌కు లేఖ