21 రోజులు నరకం చూశా – జెనీలియా..

  • Published By: madhu ,Published On : August 30, 2020 / 09:52 AM IST
21 రోజులు నరకం చూశా – జెనీలియా..

21 రోజులు నరకం చూశా..అన్నింటికంటే బలం అతి పెద్దది..ప్రతొక్కరికి కావాల్సింది ఇదే..కుటుంబ సమక్షంలోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటోంది నటి జెనీలియా. కొన్ని రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

దీంతో 21 రోజుల పాటు..అందరికీ దూరంగా ఉండి..కరోనా వైరస్ కు చికిత్స తీసుకున్నారు. తాజాగా తాను ఈ వైరస్ నుంచి బయటపడినట్లు, పూర్తిగా కోలుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా పోస్టు చేశారు. ఈ వైరస్ ను జయించి..కుటుంబంతో హాయిగా గడిపేందుకు సిద్దమయ్యానన్నారు.

మూడు వారాల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది. కానీ..లక్షణాలేవీ బయటపడలేదు. దేవుడి దయ వల్ల ఈ రోజు కోవిడ్‌ నెగటివ్‌ ఫలితం వచ్చింది. తనపై కురిపించిన ఆశీర్వాదాలు వ్యాధితో పోరాటాన్ని సులభతరం చేశాయి. కానీ..21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండటం అనేది చాలా కఠినమైనది.

ఫేస్‌టైం, ఇతరత్రా డిజిటల్‌ వ్యాపకాలు ఒంటరితనం అనే దుష్టశక్తిని అంతం చేయలేవు. నన్ను ప్రేమించే వాళ్లు, నా కుటుంబ సభ్యుల సమక్షంలోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే..ఇక్కడ అన్నింటి కంటే బలం అతిపెద్దది.

ప్రతీ ఒక్కరికి కావాల్సింది ఇదే జెనీలియా ఇన్ స్ట్రాగ్రామ్ లో లేఖను పంచుకున్నారు. ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా, వీలైనంత త్వరగా పరీక్ష చేయించుకుని పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.

ఇక జెనీలియా విషయానికి వస్తే…బాలీవుడ్‌తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దక్షిణాదిన అగ్ర తారగా వెలుగొందారు. తన నటన, హావభావాలతో అభిమానులను అలరించింది. తెలుగులో కూడా పలు సినిమాలు చేశారు. రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ దంపతులకు రియాన్‌, రేహిల్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.