Gopichand Malineni: ప్రభాస్‌ను లైన్‌లో పెడుతున్న గోపీచంద్.. ఎలాంటి కంటెంట్‌తో వస్తాడో..?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గోపీచంద్ మలిచిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెచ్చిపోయి నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ సక్సెస్ అయ్యింది. అటు థమన్ ఈ సినిమాకు అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది.

Gopichand Malineni: ప్రభాస్‌ను లైన్‌లో పెడుతున్న గోపీచంద్.. ఎలాంటి కంటెంట్‌తో వస్తాడో..?

Gopichand Malineni To Narrate Story To Prabhas

Gopichand Malineni: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గోపీచంద్ మలిచిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెచ్చిపోయి నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ సక్సెస్ అయ్యింది. అటు థమన్ ఈ సినిమాకు అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది.

Gopichand Malineni : నమ్మిన వాళ్ళు మోసం చేసారంటూ అన్‌స్టాపబుల్ స్టేజిపై ఏడ్చేసిన డైరెక్టర్ గోపీచంద్..

కాగా, వీరసింహారెడ్డి సినిమాతో బాలకృష్ణ వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని, తన నెక్ట్స్ ప్రాజెక్టును ఎవరితో చేస్తాడా అనే విషయంపై ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గోపీచంద్ మలినేని తన నెక్ట్స్ మూవీని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం గోపీచంద్ ఓ పవర్‌ఫుల్ కథను కూడా చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Gopichand Malineni : బాలకృష్ణకి డైరెక్టర్ మొదట వినిపించింది వీరసింహారెడ్డి స్టోరీ కాదట..

అయితే ప్రభాస్ ఇప్పటికే సలార్ లాంటి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ప్రభాస్ కోసం గోపీచంద్ మలినేని ఎలాంటి కంటెంట్‌ను పట్టుకొస్తాడా అని ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.