Gopichand : ప్రభాస్ అడిగితే మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయడానికి రెడీ..

పక్కా కమర్షియల్ సినిమా జులై 1న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. గోపీచంద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.............

Gopichand : ప్రభాస్ అడిగితే మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయడానికి రెడీ..

Prabhas

Prabhas :  జయం, వర్షం, నిజం.. సినిమాలతో విలన్ గా మెప్పించి ఆ తర్వాత హీరోగా సెటిల్ అయిన గోపీచంద్ మొదట వరుస విజయాలు చూసినా ఆ తర్వాత కాస్త తడబడ్డాడు. ఇటీవలే సీటిమార్ సినిమాతో మంచి మాస్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాతో రానున్నాడు గోపీచంద్. మారుతి దర్శకత్వంలో, గోపీచంద్, రాశిఖన్నా జంటగా తెరకెక్కిన సినిమా పక్క కమర్షియల్.

 

పక్కా కమర్షియల్ సినిమా జులై 1న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. గోపీచంద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపాడు. ప్రభాస్, గోపీచంద్ ఎప్పట్నుంచో మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమాలో విలన్ గా ఛాన్స్ వస్తే చేస్తారా అని అడిగితే గోపీచంద్.. ”ప్రభాస్ అడిగితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. ఎందుకు, ఏంటి, క్యారెక్టర్ ఏంటి, కథ ఏంటి అని ఏమి అడగను. ప్రభాస్ అడిగితే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాను. విలన్ క్యారెక్టర్ అయినా చేస్తాను” అని తెలిపాడు.

Mega 154 : సంక్రాంతికి కలుద్దాం అంటున్న మెగాస్టార్.. బాబీ డైరెక్షన్‌లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ..

 

ప్రభాస్ కి విలన్ గా గోపీచంద్ చేస్తాను అనడంతో మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కి ఫస్ట్ పెద్ద హిట్. అందుకే మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి అది ఏ డైరెక్టర్ తీరుస్తాడో చూడాలి.