RRR Dosti : అంచనాలు పెంచేసిన హేమచంద్ర

కీరవాణి సారథ్యంలో ఐదుగురు సింగర్లు హేమచంద్ర, అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ జేసుదాస్, యాజిన్ నిజర్ ఈ సాంగ్ పాడారు. ఈ మేరకు వదిలిన ఓ ఫొటో నెట్టింట ఓ రెంజ్ లో వైరల్ అయ్యింది. పాడడం ఒకెత్తు అయితే..ప్రమోషన్ లో ఉండడం మరో ఎత్తు అంటూ హేమచంద్ర కామెంట్ చేశారు.

RRR Dosti : అంచనాలు పెంచేసిన హేమచంద్ర

Hema

Hema Chandra RRR : టాలీవుడ్ లో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాపై చర్చ జరుగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ హీరోలుగా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేగంగా షూటింగ్ కొనసాగుతోంది. రాజమౌళి..విషయానికి వస్తే..ఆయన సినిమా ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు.

Read More : Petrol Rate : 13 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతుంటారు. షూటింగ్ కు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల చేస్తామని ప్రకటించడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే..‘దోస్తీ’ అంటూ ప్రమోషనల్ సాంగ్ కోసం ఐదు భాషల నుంచి ఐదుగురు సింగర్లను దించారు. 2021, ఆగస్టు 01వ తేదీన రాబోతున్న ఈ దోస్తీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read More :Photojournalist Danish Siddiqui : ఫొటో జర్నలిస్ట్ సిద్ధిఖీ కాల్పుల్లో చనిపోలేదు.. తాలిబన్లే ఉరితీసి చంపేశారు!

కీరవాణి సారథ్యంలో ఐదుగురు సింగర్లు హేమచంద్ర, అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ జేసుదాస్, యాజిన్ నిజర్ ఈ సాంగ్ పాడారు. ఈ మేరకు వదిలిన ఓ ఫొటో నెట్టింట ఓ రెంజ్ లో వైరల్ అయ్యింది. పాడడం ఒకెత్తు అయితే..ప్రమోషన్ లో ఉండడం మరో ఎత్తు అంటూ హేమచంద్ర కామెంట్ చేశారు. కీరవాణి, రాజమౌళితో పనిచేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని, కచ్చితంగా తన కల నెరవేరిన రోజుగా హేమచంద్ర అభివర్ణించారు. ఈ పాట ఎలా వచ్చింది ? ఎంత బాగా వచ్చిందనేది మాటల్లో చెప్పలేకపోతున్నట్లు తెలిపారు. ప్రమోషన్ సాంగ్ లో ఉండడం. అది వచ్చిన తీరు మైంబ్ బ్లోయింగ్ గా వెల్లడించారు. సిరివెన్నెల సీతారామాశాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు.