Suriya : డబ్బింగ్ ఆర్టిస్ట్ మరణం.. హీరో సూర్య ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. సూర్య అన్ని సినిమాలకు శ్రీనివాస మూర్తి తెలుగులో డబ్బింగ్ చెబుతూ వచ్చేవాడు. దీంతో శ్రీనివాస మూర్తి మరణ వార్త తెలుసుకున్న హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

Suriya : డబ్బింగ్ ఆర్టిస్ట్ మరణం.. హీరో సూర్య ఎమోషనల్ పోస్ట్!

suriya dubbing artist

Suriya : సినీ పరిశ్రమలో గత కొంతకాలం నుంచి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తరువాత ఒకరు ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు స్వర్గస్తులు అవుతూ టాలీవుడ్ సినీ పరిశ్రమని శోకసంద్రంలో ముంచేశారు. తాజాగా ఈరోజు సినీ పరిశ్రమ రెండు విషాదకర వార్తలు వినాల్సి వచ్చింది. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ జమున కన్నుమూసి ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేశారు. ఈరోజు ఉదయమే ఇండస్ట్రీకి సంబంధించిన మరో వ్యక్తి మరణ వార్త కూడా అందర్నీ షాక్ కి గురి చేసింది.

Srinivasa Murthi : టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత..

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీనివాస మూర్తి కన్నుమూశాడు. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పిన శ్రీనివాస.. పాత్రకి తగట్టు, సన్నివేశానికి తగట్టు తన గొంతుని సవరించి పాత్రలోని ఎమోషన్ ని తన గాత్రంలోనే చూపించి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ అనిపించుకున్నాడు. తన డబ్బింగ్ కెరీర్ లో సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ వంటి అగ్ర కథానాయకులకు గొంతుని అందించాడు. కాగా శ్రీనివాస మూర్తి మరణ వార్త తెలుసుకున్న హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

సూర్య అన్ని సినిమాలకు శ్రీనివాస మూర్తి తెలుగులో డబ్బింగ్ చెబుతూ వచ్చేవాడు. దీంతో సూర్య, శ్రీనివాసతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘తెలుగులో నా నటనకి జీవం పోసింది శ్రీనివాస మూర్తి గారు. ఆయన మరణం నాకు తీరని లోటు. చాలా తొందరగా వెళ్లిపోయారు శ్రీనివాస మూర్తి గారు. మేము మిమల్ని మిస్ అవుతాము’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా గుండె సంబంధింత సమస్యలు ఉన్న శ్రీనివాస మూర్తి ఈరోజు ఉదయం గుండెపోటు రావడంతో మరణించినట్లు తెలుస్తుంది.