Hero Suriya : నడిఘర్ సంఘ భవన నిర్మాణానికి 25 లక్షలు విరాళం ఇచ్చిన సూర్య, కార్తీ..
తాజాగా నడిగర్ సంఘం కార్యవర్గ సమావేశాన్ని చెన్నైలోని ఒక హోటల్లో నిర్వహించగా అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఇందులో సంఘానికి సంబంధించిన పలు అంశాలను........
Hero Suriya : తమిళనాడుకి చెందిన ఆర్టిస్టుల యూనియన్ నడిగర్ సంఘం ఎలక్షన్స్ జరిగి అనేక ట్విస్టుల తర్వాత ఇటీవలే వాటి రిజల్ట్స్ వచ్చాయి. అధ్యక్షుడిగా నాజర్, కోశాధికారిగా కార్తీ గెలుపొందారు. అయితే ఎప్పట్నుంచో నడిగర్ సంఘానికి సొంత భవనం ఉండాలని అంతా భావిస్తున్నారు. ఈ సారైనా నడిగర్ సంఘ భవనం కట్టాలని ఇటీవల గెలిచిన వర్గం భావిస్తుంది. ఇప్పటికే ఆ దిశగా పనులు ప్రారంభించింది నడిగర్ సంఘం.
తాజాగా నడిగర్ సంఘం కార్యవర్గ సమావేశాన్ని చెన్నైలోని ఒక హోటల్లో నిర్వహించగా అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఇందులో సంఘానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. ఆ తర్వాత ఇటీవల నేషనల్ అవార్డు దక్కించుకున్న తమిళ సినిమాలని, వ్యక్తులని అభినందించారు. అనంతరం హీరో సూర్య, కార్తీ కలిసి నడిగర్ సంఘ భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు విరాళాన్ని అందజేశారు. అధక్షుడు నాజర్ దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ వారిద్దరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక అభిమానులు సూర్య, కార్తీలని అభినందిస్తున్నారు.