EMK: ఎన్టీఆర్ షోలో మహేష్.. ఎంత గెలుచుకున్నాడంటే?

తెలుగు బుల్లితెరపై ఇప్పుడు బిగ్ ఎంటర్టైన్మెంట్స్ షోస్ హవా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కూడా ఒకవైపు బిగ్ బాస్ హవా కొనసాగిస్తుండగా.. నాలెడ్జ్ కి నాలెడ్జ్..

EMK: ఎన్టీఆర్ షోలో మహేష్.. ఎంత గెలుచుకున్నాడంటే?

Emk

EMK: తెలుగు బుల్లితెరపై ఇప్పుడు బిగ్ ఎంటర్టైన్మెంట్స్ షోస్ హవా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కూడా ఒకవైపు బిగ్ బాస్ హవా కొనసాగిస్తుండగా.. నాలెడ్జ్ కి నాలెడ్జ్.. ఎంటెర్టైమెంట్ కి కూడా డోకా లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సత్తా చాటుతున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి ఎపిసోడ్ కే రామ్ చరణ్ హాజరై సందడి చేయగా.. అనంతనం దర్శక దిగ్గజాలు, హోస్ట్ ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తులైన రాజమౌళి, కొరటాల శివ కలిసి కట్టుగా వచ్చి పసందైన వినోదం పంచారు.

రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ మాత్రమే కాదు మరికొందరి టాప్ స్టార్స్ కూడా ఈ షోకు ప్రత్యేక అతిధులుగా హాజరుకానున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హాజరు కానుండగా, ఇప్పటికే షో షూటింగ్ పూర్తైందని చెప్తున్నారు. మహేష్ ఎపిసోడ్ కు సంబంధించిన ఫొటో కూడా ఒకటి బయటకు రాగా.. ఆ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దసరా సందర్భంగా ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలుస్తుండగా ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కాగా, ఇంతకీ ఈ షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. నిజానికి మహేష్ జనరల్ నాలెడ్జ్ లో చాలా పరిణితి చెందినవాడని చెప్పుకుంటారు. పుస్తకాలు చదవడమే కాదు.. దేశవిదేశాలను చుట్టేయడంలో కూడా మహేష్ దిట్ట. కనుక ఈ ఎపిసోడ్ హోరాహోరీగా నడిచిందని తెలుస్తుండగా.. మధ్యలో మహేష్ బాబు- ఎన్టీఆర్ మధ్య జరిగిన సంభాషణ ఇరువురు అభిమానులకు కిక్కిస్తుందంటున్నారు. ఇక ఈ ఆటలో మహేష్ మొత్తం పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్నట్లు కథనం లీకవగా.. ఆ మొత్తాన్ని ఓ ఛారిటీకి డొనేట్ చేశారని తెలుస్తోంది. కాగా, మహేష్ త్వరలో ప్రభాస్, అల్లు అర్జున్ కూడా ఈ షోకి రానున్నట్లు తెలుస్తుంది.